News March 29, 2025

వనపర్తి: రేషన్‌కార్డు దారులకు శుభవార్త

image

ఉగాది పర్వదినం నుంచి ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రేషన్‌కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేయనున్నారు. మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీతో రేషన్‌కార్డులు కలిగి ఉన్నవారందరికీ ప్రయోజనం కలుగనున్నది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 14, 2026

కొత్తకొండ వీరభద్రుడికి కుమ్మరి బోనం

image

భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కడిపికొండ, దామెర కుమ్మరి వంశస్తులు ఆనవాయితీ ప్రకారం భోగి రోజున వీరబోనం చేశారు. శివసత్తుల నృత్యాలు, వీరశైవుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చి గండ దీపం వద్ద నూనె పోసి, కోరుకున్న కోరికలకు మీసాలు, కోడె మొక్కులు సమర్పించారు.

News January 14, 2026

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సంక్రాంతి విషెస్

image

AP: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్లె సీమలు ఆధునికతను సంతరించుకున్నా మన సంప్రదాయాలను మరచిపోకుండా పాటించాలని కోరుకుంటున్నాను. అందరికీ అనువైన పథకాలతో ప్రభుత్వం మరింత బాధ్యతతో వ్యవహరిస్తుందని హామీ ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు.

News January 14, 2026

భద్రాద్రి: ఏ పార్టీతో దోస్తీ.. ఏ పార్టీతో కుస్తీ..!

image

భద్రాద్రి జిల్లాలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లందు, అశ్వరావుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో దోస్తీ, ఏ పార్టీతో కుస్తీ పడతారో క్లారిటీ రాలేదు. కాంగ్రెస్, సీపీఐ మధ్య దోస్తీ కటీఫ్ అయిందని BRSతో పొత్తుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మేం పోటీలో ఉంటామని బీజేపీ, జనసేన నాయకులు ప్రకటించారు. పొలిటికల్ దోస్తీపై మీ కామెంట్..?