News March 29, 2025
పెద్దపల్లి: పరువు హత్య UPDATE..

ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ప్రేమ వ్యవహారంతో యువకుడి హత్య కేసుకు సంబంధించి పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. A-1 ముత్యం సదయ్య (యువతి తండ్రి), A-2 ముత్యం సమత (యువతి తల్లి), A-3 సిద్ధ సారయ్య (యువతి మేనమామ) పై హత్య కేసు నమోదు చేశారు. హత్యకు ప్రేరేపించిన ఇతరులపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 13, 2026
శ్రీకాకుళం: మాజీ మంత్రి సూర్యనారాయణ అంత్యక్రియలు పూర్తి

మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు శ్రీకాకుళంలో మంగళవారం పూర్తి చేశారు. అధిక సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులు మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రజా సేవ లక్ష్యంగా పని చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎమ్మెల్యే రమణమూర్తి పేర్కొన్నారు. ఎన్నో ఎదురు దెబ్బలకు ఎదుర్కొన్న ఆయన టీడీపీలో ఊపిరి పోయేవరకు కొనసాగారని వివరించారు. ఆయన మృతితో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
News January 13, 2026
EC షెడ్లో కోడి పిల్లలను వదిలేముందు పేపర్ వేస్తున్నారా?

EC(ఎన్విరాన్మెంట్ కంట్రోల్డ్) షెడ్లో పొట్టు మీద కోడి పిల్లలను నేరుగా వదలడం మంచిది కాదు. షెడ్లో పొట్టు కాస్త పదునుగా ఉండటం వల్ల కోడి పిల్లల కాళ్ల మధ్య గుచ్చుకొని గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పొట్టుపై కచ్చితంగా పేపర్ వేశాకే చిన్న కోడి పిల్లలను వదలాలి. 1000 పిల్లలకు 5 కేజీల పేపరును పైన వీడియోలో చెప్పిన విధంగా వేయాలి. పేపరు వల్ల కోడి పిల్లలు ఆహారాన్ని సులభంగా గుర్తించి తినగలుగుతాయి.
News January 13, 2026
రబీ మొక్కజొన్నలో కలుపు నివారణ ఎలా?

మొక్కజొన్న విత్తిన 48 గంటలలోపు 200 లీటర్ల నీటిలో తేలిక నేలలకు అట్రాజిన్ 800గ్రా, బరువు నేలల్లో 1200 గ్రా. కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. తర్వాత 25-30 రోజులకు కలుపు ఉద్ధృతిని బట్టి 200 లీటర్ల నీటిలో టెంబోట్రయాన్ 34.4%S.C ద్రావణం 115ml కలిపి కలుపు 3,4 ఆకుల దశలో పిచికారీ చేయాలి. తుంగ సమస్య ఎక్కువుంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో హేలోసల్ఫ్యురాన్ మిథైల్ 75 W.G 36 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


