News March 29, 2025
యూట్యూబర్ శంకర్పై కేసు నమోదు

HYD అంబర్పేట పీఎస్లో యూట్యూబర్ శంకర్పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. కాగా శంకర్ది భువనగిరి జిల్లా.
Similar News
News December 30, 2025
సంగారెడ్డి: వాటర్ ట్యాంక్లో బాలుడు పడి మృతి

వాటర్ ట్యాంకులో ప్రమాదవశాత్తు ఓ బాలుడు పడి మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన రకియా సంతోష్ దంపతుల ఐదేళ్ల బాలుడు శ్యాంసుందర్ సోమవారం సాయంత్రం బడి వదలగానే ఆడుకుంటూ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ వైపు వెళ్లి, పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మృతిచెందాడు. ఈ ఘటన తండాలో విషాదం నింపింది. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
News December 30, 2025
సంగారెడ్డి: వాటర్ ట్యాంక్లో బాలుడు పడి మృతి

వాటర్ ట్యాంకులో ప్రమాదవశాత్తు ఓ బాలుడు పడి మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన రకియా సంతోష్ దంపతుల ఐదేళ్ల బాలుడు శ్యాంసుందర్ సోమవారం సాయంత్రం బడి వదలగానే ఆడుకుంటూ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ వైపు వెళ్లి, పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మృతిచెందాడు. ఈ ఘటన తండాలో విషాదం నింపింది. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
News December 30, 2025
కర్నూలు: రబీకి సరిపడా యూరియా సిద్ధం

కర్నూలు జిల్లాలో రబీకి అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జేడీఏ పీఎల్ వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే ప్రణాళిక కంటే ఎక్కువ సరఫరా జరిగిందన్నారు. ప్రస్తుతం గోదాములు, రైతు సేవా కేంద్రాల్లో 5,849 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు.


