News March 29, 2025
సిరిసిల్ల: 6753 మంది విద్యార్థులు హాజరు

సిరిసిల్ల జిల్లాలో శనివారం జరిగిన పదవ తరగతి పరీక్షలో 6,753 మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం 6,767 మంది విద్యార్థులకు గాను 6,753 మంది హాజరయ్యారని స్పష్టం చేశారు. 14 మంత్రి విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 15, 2026
మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్

TG: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. కాగా గత నెలలో ఫిరాయింపులకు సరైన ఆధారాల్లేవని <<18592868>>ఐదుగురు<<>> MLAలకు స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ తమ అనర్హతపై ఇంకా స్పీకర్కు వివరణ ఇచ్చుకోలేదు.
News January 15, 2026
తిరుమలలో సుప్రభాత సేవ పునః ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో నెల రోజులు జరిగిన ధనుర్మాస కైంకర్యాలు నిన్నటితో ముగిశాయి. డిసెంబర్ 17వ తేదీ నుంచి జనవరి 14వరకు ధనుర్మాసం సాగింది. ఈ సందర్భంగా సుప్రభాత సేవ నిలిపేశారు. తిరుప్పావై పాశురాల పారాయణంతో స్వామివారిని మేల్కొలిపారు. ధనుర్మాసం ముగియడంతో గురువారం వేకువజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు పూర్తి చేశారు.
News January 15, 2026
ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.


