News March 29, 2025
విశాఖ: ఐపీఎల్ మ్యాచ్కు సర్వం సిద్ధం

విశాఖ పీఎంపాలెం ఏసీఏ-వీసీడిఏలో నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్కు సర్వం సిద్ధమైనట్లు శనివారం నిర్వాహకులు తెలిపారు. ఆదివారం కావడంతో అధికసంఖ్యలో ప్రేక్షకులు వస్తారన్న అభిప్రాయంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రేపు ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ అభిమానులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్లాక్ టికెట్ల కట్టడికి పోలీసులు నిఘా ఉంచినట్లు తెలిపారు.
Similar News
News January 16, 2026
విశాఖ: 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 2 రోజులుగా విశాఖలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు,ర వాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.52,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు.
News January 16, 2026
ఎల్ఐసీ బిల్డింగ్ సమీపంలో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్ఐసీ బిల్డింగ్ మధ్యలో ఉన్న బస్టాప్ వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు 75 సంవత్సరాలు దాటి ఉంటుందని ట్రాఫిక్ ఎస్ఐ సింహాచలం తెలిపారు. వైట్ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. సీసీ ఫుటేజ్లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News January 16, 2026
విశాఖ: చీర విషయంలో గొడవ.. బాలిక ఆత్మహత్య

విశాఖలో పండగ పూట విషాదం నెలకొంది. MVP పోలీసుల వివరాల ప్రకారం.. పాత వెంకోజీ పాలెంలో ఉంటున్న బాలిక పల్లవి పండగ సందర్భంగా చీర కట్టుకుంటానని తల్లి లక్ష్మిని కోరింది. చీర వద్దు హాఫ్శారీ కట్టుకోమని తల్లి చెప్పడంతో గురువారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన పల్లవి MVP కాలనీలో తన తాతయ్య వాచ్మెన్గా ఉంటున్న రెసిడెన్సి వద్ద ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


