News March 29, 2025

అనకాపల్లి: ‘రెవెన్యూ అధికారుల చర్య కోర్టు ధిక్కరణే’

image

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గధబపాలెం గిరిజనులు సాగు చేస్తున్న భూముల సమస్యపై నర్సీపట్నం కోర్టులో కేసు ఉంది. కాగా ఎమ్మార్వో గిరిజనేతరుల పేరు మీద రికార్డులు బదిలీ చేయడం ముమ్మాటికీ కోర్టు దిక్కరణ చర్యే అవుతుందని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ తెలిపారు. ఈ మేరకు శనివారం ఈ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించారు. గిరిజనులకు న్యాయం కోసం తాను కృషి చేస్తానన్నారు.

Similar News

News November 4, 2025

మెట్‌పల్లి: నిజాయితీ చాటుకున్న యువకుడు

image

మెట్‌పల్లి పట్టణంలోని దుబ్బవాడలో జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు జెట్టి నరేంద్ర తన ఇంటి బయట రోడ్డుపై పడిపోయిన ఫోనును గుర్తించాడు. దానిని తీసి వెంటనే చుట్టుపక్కల వారిని ఫోను ఎవరిదని వివరాలు అడగగా.. ఎవరు తమకు తెలియదని చెప్పారు. దీంతో ఆ ఫోనును స్థానిక పోలీస్ స్టేషన్ లో అందజేసి పోగొట్టుకున్న వారిని గుర్తించి వారికి ఫోన్ అందజేయాలని ఆయన కోరారు. ఎండి ముక్తార్, జెట్టి నరేష్ ఉన్నారు.

News November 4, 2025

మెట్‌పల్లి: మా కష్టం చూసి దేవుడూ కరగడా..?

image

ఆరుగాలం కష్టం.. అంతా వృథా. MTPL(M) మెట్లచిట్టాపూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పపక్కన నిలబడి, కన్నీరు పెట్టుకున్నఓ మహిళా రైతు ఆవేదన ఎవరికి చెప్పేది? మొన్న తుఫాను, నిన్న మొలకలు. 2 రోజులు ఎండ వచ్చిందని ఆరబెడితే, కుప్ప అడుగుభాగంలోనే ధాన్యం మొలకెత్తింది. ‘నష్టపోయిన మాపై దేవుడికి కూడా చిన్నచూపేనా?’ అంటూ గుండెలు బాదుకుంది. కష్టపడి పండించిన ధాన్యం ఇలా పాడవడం చూసి ఆ అన్నదాత కన్నీరు ఆపడం ఎవరి వశంకాలేదు.

News November 4, 2025

అమరచింతలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో అత్యధికంగా అమరచింతలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఘనపూర్ 6.2 గోపాల్ పేట్ 7.2 వనపర్తి 6.2 ఆత్మకూరు 13.6 వీపనగండ్ల 0.8 రేవల్లి 2.8 చిన్నంబాయిలలో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా సీపీఓ తన నివేదికలో పేర్కొన్నారు. జిల్లా ఒకరోజు వర్షపాతం మొత్తం 59.6 మిల్లీమీటర్లు కాగా సగటు 4.2 మిల్లీమీటర్లు నమోదయిందన్నారు.