News March 25, 2024

మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మంత్రిపై కేసు

image

ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు DMK మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై కేసు నమోదైంది. తమిళనాడు పర్యటనలో భాగంగా మాజీ సీఎం కామరాజ్‌ను ప్రశంసించినందుకు ప్రధానిపై ఆయన అసహ్యకరంగా, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సిద్రంగనాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెగ్ననపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 21, 2025

నెల్లూరు కలెక్టరేట్‌లో ఉచిత భోజనం

image

నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) సోమవారం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. వీరికి కలెక్టర్ ఓ.ఆనంద్ ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు. తీవ్రమైన ఎండలతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

News April 21, 2025

చెట్లకు చికిత్స అందిస్తున్నారు!

image

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మనుషులకు, జంతువులకు డాక్టర్లు ఉండటం చూశాం. కానీ, చెట్ల ఆరోగ్యం కోసం పంజాబ్‌కు చెందిన IRS అధికారి రోహిత్ మిశ్రా పాటుపడుతున్నారు. ఆయన ప్రపంచంలోనే మొదటి ట్రీ క్లినిక్‌ను స్థాపించగా దీనికి ప్రత్యేకమైన అంబులెన్స్ కూడా ఉంది. ఇందులోని రకరకాల ఆయుర్వేదిక్, ఆర్గానిక్ మందులు మొక్కలకు వచ్చే సమస్యలకు చెక్ పెడతాయని తెలిపారు. అడవిలోని వేలాది మొక్కలకు ఆయన పునర్జన్మనిచ్చారు.

News April 21, 2025

మళ్లీ కలవనున్న ఠాక్రే సోదరులు

image

హిందీ వ్యతిరేక ఉద్యమంతో మహారాష్ట్ర కజిన్స్ కలుస్తున్నారు. అన్నదమ్ముల పిల్లలైన ఉద్ధవ్ ఠాక్రే (శివసేన-UBT), రాజ్ ఠాక్రే (మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన) 20 ఏళ్లుగా సొంత పార్టీలు నడుపుతున్నారు. స్కూళ్లలో హిందీని తప్పక బోధించాలన్న MH ప్రభుత్వ నిర్ణయాన్ని ఇద్దరూ ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాలకై ఉద్ధవ్‌తోనూ కలిసి ఉద్యమిస్తానని MNS చీఫ్ ఇటీవల ప్రకటించగా మాజీ సీఎం కూడా ఓకే అన్నట్లు తాజాగా సిగ్నలిచ్చారు.

error: Content is protected !!