News March 29, 2025
KMR: మహిళా సాధికారత దిశగా వరి కొనుగోళ్లు: కలెక్టర్

మహిళా సాధికారత దిశగా కామారెడ్డి జిల్లా అడుగులు వేస్తుందని.. అందులో భాగంగానే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టరేట్లో శనివారం గ్రామ అధ్యక్షులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 183 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 17, 2026
ఖమ్మం: విషాదం.. ఆరిన ఆరు ప్రాణాలు..!

ఆ కుటుంబంలో గ్యాస్ ప్రమాదం రాజేసిన మంటలు.. ఏడాది తిరగకముందే అందరినీ బలితీసుకుంది. తల్లాడ(M) మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్ ఇంట్లో ఏడాది క్రితం జరిగిన సిలిండర్ పేలుడులో కవలలు, నాయనమ్మ, మేనకోడలు మృతి చెందగా.. ఆ దుఃఖాన్ని భరించలేక తల్లి రేవతి కొద్దిరోజుల క్రితమే తనువు చాలించింది. తాజాగా తండ్రి వినోద్ సైతం మనస్తాపంతో ఉరేసుకున్నాడు. కళ్లముందే కళకళలాడిన ఇల్లు శ్మశానవైరాగ్యాన్ని తలపిస్తుంది.
News January 17, 2026
ఇంద్రవెల్లి: మర్రి చెట్ల చెంతకు చేరిన మెస్రం వంశీయులు

ఈనెల 18న నిర్వహించే నాగోబా మహా పూజకు అవసరమయ్యే పవిత్ర గంగాజలంతో తిరుగు ప్రయాణమైన మెస్రం వంశీయులు కేస్లాపూర్ పొలిమేరకు చేరుకున్న విషయం తెలిసిందే. మరి చెట్టు వద్దనే ఆదివారం వరకు గడపనున్నారు. మహాపూజలకు ఉపయోగించే మట్టికుండలను సిరికొండ వెళ్లి మెస్రం వంశీయులు తీసుకొని వచ్చి ఆలయ వెనుక భాగంలో భద్రపరిచారు. ఆదివారం రాత్రి పవిత్ర గంగా జలంతో నాగోబాను అభిషేకించి జాతర ప్రారంభించనున్నట్లు ఆలయ పీఠాధిపతి తెలిపారు.
News January 17, 2026
NLG: మున్సిపాలిటీల్లో ఆధిపత్యం ఆమెదే!

మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో గెలుపోటములు నిర్ణయించే కీలక భూమికను మహిళలు పోషించనున్నారు. ఇటీవల ప్రకటించిన మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాలో పురుషులకంటే 21,014 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఇక జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ మహిళలకు సంక్షేమ పథకాల పేరిట పెద్దపీట వేస్తూ ప్రచారానికి సిద్ధమవుతుండగా BRS, BJP సైతం మహిళలను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.


