News March 29, 2025
KMR: మహిళా సాధికారత దిశగా వరి కొనుగోళ్లు: కలెక్టర్

మహిళా సాధికారత దిశగా కామారెడ్డి జిల్లా అడుగులు వేస్తుందని.. అందులో భాగంగానే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టరేట్లో శనివారం గ్రామ అధ్యక్షులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 183 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,690 పెరిగి రూ.1,42,150కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,550 ఎగబాకి రూ.1,30,300 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.12వేలు పెరిగి రూ.2,87,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి
News January 12, 2026
‘గోల్డెన్ గ్లోబ్’ వేడుకల్లో ప్రియాంక మెరుపులు

అంతర్జాతీయ వేదికపై మరోసారి భారతీయ సినీ స్టార్ మెరిశారు. గతంలో ఆస్కార్ వేడుకల్లో దీపికా పదుకొణె ప్రత్యేక ఆకర్షణగా నిలవగా తాజాగా జరుగుతున్న గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్కు ప్రియాంకా చోప్రా హాజరయ్యారు. బ్లూడ్రెస్లో రెడ్ కార్పెట్పై హొయలు పోయారు. తన భర్త నిక్ జోనస్తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. కాగా 2023లో RRR ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది.
News January 12, 2026
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 85 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై వరంగల్ పోలీసులు నిఘా పెంచారు. కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 85 మంది పట్టుబడ్డారు. వారిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ విభాగం పరిధిలో అత్యధికంగా 35 కేసులు నమోదవగా.. సెంట్రల్ జోన్లో 21, వెస్ట్ జోన్లో 15, ఈస్ట్ జోన్లో 14 కేసులు నమోదయ్యాయి.


