News March 29, 2025
NGKL: దోమలపెంట వద్ద రోడ్డు ప్రమాదం.. UPDATE

శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి <<15928031>>దోమల పెంట సమీప అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం<<>>లో మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి సుధాకర్ పటేల్ దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాలు.. పోలీసు అకాడమీలో విధులు నిర్వహిస్తున్న సుధాకర్ పటేల్తో పాటు మరో వ్యక్తి భగవత్ కృష్ణారావు మృతి చెందారు. శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో వీరిరువురు మృతి చెందారు.
Similar News
News March 1, 2026
ఖమేనీ చనిపోయారు: ట్రంప్

ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖమేనీని చరిత్రలోనే అత్యంత చెడ్డ వ్యక్తిగా పేర్కొన్నారు. ఈ చావుతో ఇరాన్ పౌరులతో పాటు అమెరికన్లు, బాధిత దేశాలకు న్యాయం జరిగిందన్నారు. తమ నిఘా నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని అన్నారు. ఇరాన్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్కడి పౌరులకు ఇది అతిపెద్ద అవకాశమన్న ట్రంప్.. దాడులు మరో వారం కొనసాగుతాయన్నారు.
News March 1, 2026
ఏలూరు: కార్మిక శాఖ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు జిల్లాలో 18 ఏళ్లు నిండిన కార్మికులు వివాహ కానుక, ప్రసూతి ప్రయోజన, సహజ మరణ ఉపశమన, అంత్యక్రియల వ్యయ సహాయ పథకాలకు దరఖాస్తు చేయాలని ఉప కార్మిక డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటికే ఈ పథకాలను నమోదు చేసుకున్న కార్మికులు వివరాలను (నవీకరణ) అప్డేట్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా లేబర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News March 1, 2026
సండేను ఫండేగా మార్చుకోండి

వారమంతా బిజీగా గడిపిన చాలా మందికి సండే అంటే రెస్ట్డే. ఎక్కువసేపు నిద్రపోయేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఆదివారాన్ని ప్రొడక్టివ్గా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కుటుంబంతో సమయం గడపడం, బుక్ రీడింగ్, వాకింగ్, గదిని సర్దుకోవడం, ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడం వంటివి చేస్తే స్ట్రెస్ తగ్గుతుందని అంటున్నారు. దీంతో పాటు వచ్చేవారంలో చేయాల్సిన పనులపై ప్లాన్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.


