News March 29, 2025

బాపట్ల: యువకులను కాపాడిన పోలీసులు

image

బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో అలల తాకిడికి మునిగిపోతున్న యువకులను పోలీసులు కాపాడారు. పోలీసుల కథనం మేరకు.. నల్గొండ జిల్లాకు చెందిన చిన్న, శ్రీనులు శనివారం బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరానికి వచ్చారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి మునిగిపోతుండగా స్థానికులు కేకలు వేయటంతో వెంటనే పోలీసులు కొట్టుకుపోతున్న వారిని కాపాడారు.

Similar News

News November 4, 2025

HYD: సీఐను అభినందించిన రాచకొండ సీపీ

image

యాదాద్రి భువనగిరి రూరల్ CI చంద్రబాబు నగరి కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ అవార్డు అందుకున్నారు. రాచకొండ CP సుధీర్‌బాబు ఈరోజు HYD నేరెడ్‌మెట్‌లోని CP ఆఫీస్‌లో CIని సత్కరించారు. మరిన్ని అవార్డులు అందుకుని కమిషనరేట్‌కి పేరు తేవాలని ఆయన అభినందించారు. నేర పరిశోధనలో విశిష్ట సేవలకు ఈ జాతీయ అవార్డు లభించింది. TGనుంచి సైబరాబాద్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్‌రావు, CI సెల్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి అవార్డుకు ఎంపికయ్యారు.

News November 4, 2025

HYD: సీఐను అభినందించిన రాచకొండ సీపీ

image

యాదాద్రి భువనగిరి రూరల్ CI చంద్రబాబు నగరి కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ అవార్డు అందుకున్నారు. రాచకొండ CP సుధీర్‌బాబు ఈరోజు HYD నేరెడ్‌మెట్‌లోని CP ఆఫీస్‌లో CIని సత్కరించారు. మరిన్ని అవార్డులు అందుకుని కమిషనరేట్‌కి పేరు తేవాలని ఆయన అభినందించారు. నేర పరిశోధనలో విశిష్ట సేవలకు ఈ జాతీయ అవార్డు లభించింది. TGనుంచి సైబరాబాద్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్‌రావు, CI సెల్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి అవార్డుకు ఎంపికయ్యారు.

News November 4, 2025

మీర్జాగూడ ఘటన.. TGSRTC తీవ్ర దిగ్ర్భాంతి

image

మీర్జాగూడ ఘటనపై TGSRTC తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 19 మంది మృతిచెందగా, 25 మంది గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. బస్సుకు ఫిట్‌నెస్ ఉందని, బస్సు డ్రైవర్‌కు ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు TG ప్రభుత్వం రూ.5 లక్షలు, RTC రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపింది.