News March 29, 2025

వృద్ధ దంపతుల ప్రాణాలు తీసిన సైబర్ నేరగాళ్లు

image

సైబర్ మోసగాళ్ల దోపిడీతో కర్ణాటకకు చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు వీరికి వీడియో కాల్ చేసి తాము ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులమని.. మీపై కేసులయ్యాయని బెదిరించారు. దీంతో భయపడిన దంపతులు తొలుత రూ.5లక్షలు చెల్లించారు. అక్కడితో ఆగకుండా తరచుగా బెదిరిస్తూ రూ.50 లక్షలు దోపిడీ చేశారు. దీంతో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వారి సూసైడ్ లెటర్‌లో ఆత్మహత్య కారణాలు రాశారు.

Similar News

News April 2, 2025

వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే అత్యధికం

image

దేశంలో వక్ఫ్ ఆస్తులు అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్నట్లు ఇండియా టుడే పేర్కొంది. 27 శాతం ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయంది. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ బెంగాల్(9%), పంజాబ్(9%), తమిళనాడు(8%), కర్ణాటక(7%), కేరళ(6%), తెలంగాణ(5%), గుజరాత్(5%) ఉన్నాయని వెల్లడించింది. ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగుతోంది.

News April 2, 2025

IPLలో ప్లేయర్ మ్యాచ్ ఫీజ్ ఎంతంటే?

image

LSG బౌలర్ <<15965200>>దిగ్వేశ్<<>> సెలబ్రేషన్‌ను తీవ్రంగా పరిగణించిన BCCI మ్యాచ్ ఫీజులో 25% కోత విధించింది. కాగా, IPLలో ఓ మ్యాచ్ ఆడితే BCCI ప్లేయర్‌(ఇంపాక్ట్ ప్లేయర్)కు రూ.7.5లక్షలు చెల్లిస్తుంది. లీగ్ స్టేజ్‌లో మొత్తం 14మ్యాచులు ఆడితే రూ.1.05cr దక్కుతాయి. ఇది ఫ్రాంచైజీ ప్లేయర్‌కు చెల్లించే వేలం ధరకు అదనం. ఇందుకోసం ప్రతి జట్టు BCCIకి రూ.12.60cr చెల్లిస్తుంది. ఈ లెక్కన దిగ్వేశ్‌ రూ.1,87,500 నష్టపోనున్నారు.

News April 2, 2025

యూపీఏ హయాంలోనూ సవరణలు జరిగాయి: రిజిజు

image

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు. అందులో ప్రతిపాదించిన సంస్కరణలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. చట్టంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించొద్దన్నారు. యూపీఏ హయాంలోనూ ఈ చట్టంలో సవరణలు జరిగాయన్నారు. అది మిగతా చట్టాలపై ప్రభావం చూపిందని, అందుకే మళ్లీ సవరించాల్సి వస్తోందన్నారు.

error: Content is protected !!