News March 29, 2025
కొండాపురం ప్రమాదంలో గాయపడ్డ భార్య, భర్తలు మృతి

కడప జిల్లా కొండాపురం 4 వరుసల రహదారిలోని CMR కాంప్లెక్స్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బైకును కారు ఢీకొనడంతో బైకులో ఉన్న సరోజ, రామమోహన్ అనే దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సరోజను చికిత్స కోసం అనంతపురం హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.<<15922594>> భర్త రామ్మోహన్<<>> అనంతపురంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 2, 2025
ఒంటిమిట్టలో రైళ్లు నిలపాలి: ఎంపీ మిథున్ రెడ్డి

ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నిలపాలని ఎంపీ మిథున్రెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, భక్తుల కోసం రాయలసీమ, తిరుమల, వెంకటాద్రి, తిరుపతి–గుంటూరు ఎక్స్ప్రెస్ రైళ్లను ఒంటిమిట్టలో నిలపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ మిథున్రెడ్డి రాసిన లేఖలో కోరారు.
News April 2, 2025
పోరుమామిళ్ల: యువతి ఆత్మహత్య

పెళ్లి కావడంలేదని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోరుమామిళ్ల మండలంలో జరిగింది. పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరువెంగలాపురంలో రామ తులసి(25) అనే యువతి పెళ్లి కావడంలేదని మనస్థాపంతో మంగళవారం ఉరేసుకుంది. మృతదేహాన్ని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News April 2, 2025
ఇడుపులపాయ: IIITల్లో కొత్త కోర్సులు ..!

రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఏపీలోని 4 IIITల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు RGUKT రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులకు మైనర్ డిగ్రీ కింద క్వాంటమ్ టెక్నాలజీ కోర్సు అందుబాటులోకి రానుందన్నారు. ఇటీవల సమావేశమైన RGUKT 72వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.