News March 29, 2025
KMR: వేసవిలో చోరీలు తస్మాత్ జాగ్రత్త: SP

వేసవిలో చోరీల నివారణకు KMR జిల్లా SP రాజేశ్ చంద్ర ప్రజలకు పలు సూచనలు చేశారు. రాత్రి వేళ ఆరుబయట నిద్రించే సమయంలో ఒంటిపై ఆభరణాలు ధరించొద్దన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని DVRని రహస్య ప్రదేశంలో ఉంచాలన్నారు. తమ టూర్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయొద్దన్నారు. ఊళ్లకు వెళ్లే వారు ఇంట్లో లైటు వేసి ఉంచాలన్నారు. కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Similar News
News April 2, 2025
వెలగపూడిలో తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం సమీక్ష

తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హాజరయ్యారు. సమావేశంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆలయ భద్రత, దర్శన వ్యవస్థలో మార్పులు, భక్తుల వసతి ఏర్పాట్లు వంటి అంశాలపై సీఎం చర్చించారు.
News April 2, 2025
ముంబైని వదిలి గోవాకు?

ముంబై యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. వ్యక్తిగత కారణాలతో వచ్చే సీజన్ నుంచి దేశవాళీ క్రికెట్లో ముంబైని వదిలి గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు NOC కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు ఈమెయిల్ చేసినట్లు తెలుస్తోంది. జైస్వాల్ గోవా జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
News April 2, 2025
NZB: రేషన్ షాపులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో పలు రేషన్ దుకాణాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో లబ్ధిదారులకు సజావుగా బియ్యం పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో బియ్యం పంపిణీ జరిగింది, ఇంకా ఎంత మందికి పంపిణీ చేయాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.