News March 29, 2025
పార్వతీపురం: పదవ తరగతి విద్యార్థులకు అలెర్ట్

ఈనెల 31వ తేదిన జరగబోయే పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుందని DEO ఎన్. తిరుపతి నాయుడు శనివారం తెలిపారు. ప్రభుత్వం ఈనెల 31న రంజాన్ సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు మార్పు చేసినట్టు తెలిపారు. కావున పరీక్షా సిబ్బంది అందరూ గమనించి, అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేయాలని సూచించారు.
Similar News
News November 12, 2025
రాజన్న ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయంలోకి ప్రవేశం నిలిపివేసిన క్రమంలో ఆలయం ముందు భాగంలో మూసివేసిన గేటు ముందు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో రాజన్న దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
News November 12, 2025
గేటు వద్ద వేములవాడ రాజన్నకు మొక్కులు..!

వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనం కోసం ప్రవేశం నిలిపివేసిన నేపథ్యంలో ఆలయం బయటనే భక్తులు రాజన్నకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజన్న దర్శనం కోసం దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు ఆలయ ముందు భాగంలోని గేటు బయట కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టి.. రాజన్న మళ్లీ వస్తాం అని తిరిగి వెళుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన వైనం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తం అవుతోంది.
News November 12, 2025
HYD రానున్న.. ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ

ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ డిసెంబర్లో HYDకు రానున్నారు. CM రేవంత్ రెడ్డి రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికకు మెస్సీని బ్రాండ్ అంబాసడర్గా నియమించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రణాళిక ద్వారా తెలంగాణను 2033 నాటికి 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.


