News March 29, 2025
రాత్రి పూట అరటి పండు తింటే..

రాత్రిపూట అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి హానికరం అని ఏ సైంటిఫిక్ రిసెర్చూ తేల్చలేదు. అయితే ఆయుర్వేదం ప్రకారం రాత్రి అరటి పండు తింటే శ్లేష్మం ఉత్పత్తి అయి జలుబు చేస్తుంది. దగ్గు, గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అరటి పండును ఉదయం అల్పాహారంతో కలిపి తీసుకుంటే ఎక్కువ లాభాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు.
Similar News
News September 13, 2025
ఘర్షణల తర్వాత తొలిసారి మణిపుర్లో అడుగుపెట్టిన మోదీ

ప్రధాని మోదీ మణిపుర్ చేరుకున్నారు. ఇంఫాల్ ఎయిర్పోర్టులో ఆయనకు గవర్నర్ అజయ్ భల్లా, సీఎస్ పునీత్ గోయల్ స్వాగతం పలికారు. రెండేళ్ల నుంచి మణిపుర్లో తీవ్ర అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రాన్ని, ప్రధానిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శలు కూడా చేసింది. ఈక్రమంలో ఘర్షణల తర్వాత మోదీ తొలిసారి మణిపుర్లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
News September 13, 2025
‘మిరాయ్’కి తొలి రోజు భారీ కలెక్షన్స్

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ మూవీ ‘మిరాయ్’ నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్గా ₹27.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ తెలిపింది. దీంతో ‘హనుమాన్’ తొలిరోజు(₹8 కోట్లు) కలెక్షన్స్ను దాటేసింది. తేజ కెరీర్లో ఇవే హయ్యెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్స్. పాజిటివ్ టాక్ నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.
News September 13, 2025
1GB ప్లాన్ ఎత్తేయడంపై వివరణ కోరిన TRAI

సరసమైన 1GB ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉపసంహరణకు గల కారణాలను తెలపాలని JIO, AIRTEL సంస్థలను TRAI కోరింది. రూ.249 ప్లాన్ ఎత్తేయడంతో వినియోగదారులపై మరింత భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్లైన్లో ఈ ప్లాన్ అందుబాటులో ఉందని JIO తెలుపగా.. వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగా రూ.249 ప్లాన్ను తీసేసినట్లు AIRTEL పేర్కొంది. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ ప్లాన్ ₹299 నుంచి మొదలుకానుంది.