News March 29, 2025
అనకాపల్లి: జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్ ప్రారంభం

అనకాపల్లి జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్ శనివారం ప్రారంభమైంది. ఈ వెబ్సైట్ను జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తన కార్యాలయంలో ప్రారంభించారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించిన సమాచారం ఉపాధ్యాయుల సౌకర్యార్థం వెబ్ సైట్లో ఉంచడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో పదవ తరగతి ఒకేషనల్ ఎడ్యుకేషన్ పరీక్షకు 4,803 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ తెలిపారు. 196 మంది గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
కాకినాడ: ఏపీలోనే తొలిసారిగా.. మన తలుపులమ్మ లోవలో..!

ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ ఆలయంలో రూ.4 కోట్లతో ఎస్కలేటర్ను ఏర్పాటు చేయనున్నారు. కొండప్రాంతం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు ఎస్కలేటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోనే ఈ సదుపాయం ఏర్పాటు చేస్తున్న మొదటి దేవాలయం తలుపులమ్మ లోవ కానుంది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<