News March 30, 2025

పరీక్షల భయం.. అమ్మాయి ఆత్మహత్య

image

వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష ఒత్తిడి భరించలేక తమిళనాడు చెన్నైకి చెందిన 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికే మూడు సార్లు NEETలో ఫెయిల్ అయిన దేవదర్శిని.. మేలో మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు ప్రిపేర్ అవుతోంది. తరచూ విఫలం అవుతుండటం, సమయం వృథా కావడం, కుటుంబ ఆర్థిక సమస్యలతో సతమతం అయిన ఆమె ఇవాళ ఉరేసుకుంది.

Similar News

News April 2, 2025

అంజలి కుటుంబ సభ్యులకు జగన్ భరోసా

image

AP: AGM వేధింపులు తట్టుకోలేక రాజమండ్రిలో ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని అంజలికి అండగా ఉంటామని YS జగన్ వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని ఇవాళ తనను కలిసిన ఆమె కుటుంబ సభ్యులకు జగన్ భరోసా ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బాధితురాలి పేరెంట్స్ కోరారు. పూర్తి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.

News April 2, 2025

మాజీ సీఎం లాలూకు అస్వస్థత

image

బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీకి వెళ్లేందుకు పట్నా విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. 4.05pmకు ఎయిర్ ఇండియా విమానం ఎక్కాల్సిన ఆర్జేడీ చీఫ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కాగా, ఎయిర్ అంబులెన్సులో లాలూను ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లనున్నారు.

News April 2, 2025

BREAKING: మయన్మార్‌లో మరోసారి భూకంపం

image

వరుస భూకంపాలు మయన్మార్ ప్రజలకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మయన్మార్‌లో మరోసారి భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. 4.15pmకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. గత నెల 28న సంభవించిన భారీ భూకంపానికి ఇప్పటివరకూ 2,700 మందికి పైగా చనిపోగా శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు.

error: Content is protected !!