News March 30, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

@కలెక్టరేట్లో ధర్మపురి MLA అడ్లూరి లక్ష్మణ్ అధికారులతో సమీక్ష సమావేశం @జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు ఉగాది, రంజాన్ సంబురాలు @ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగిత్యాల MLA @రాయికల్‌లో పౌర హక్కుల దినోత్సవం @మెట్‌పల్లి ప్రభుత్వ కాలేజీలో మాదకద్రవ్య నిర్ములన పోస్టర్ ఆవిష్కరణ @బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా జడ్జి @మల్లాపూర్‌లో TDP జెండా ఆవిష్కరణ @కొండగట్టులో భక్తుల రద్దీ

Similar News

News January 20, 2026

విమాన ఛార్జీల పెంపు.. కేంద్రం, DGCAకి సుప్రీంకోర్టు నోటీసులు

image

పండుగల సమయంలో విమాన ఛార్జీలను పెంచుతూ ఎయిర్‌లైన్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఛార్జీల పెంపును నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా ధర్మాసనం విచారించింది. ‘మేము కచ్చితంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటాం’ అని స్పష్టం చేసింది. దీనిపై రిప్లైలు కోరుతూ కేంద్రం, DGCAకి నోటీసులిచ్చింది.

News January 20, 2026

కరీంనగర్: శాతవాహనలో క్రికెట్ ఎంపిక పోటీలు

image

జనవరి 26 నుండి ఫిబ్రవరి 4 వరకు జెఎస్ఎస్ అకాడమీ మైసూరులో జరగనున్న దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్ కోసం శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన SU VC ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో క్రీడాకారులు తమ శారీరక ధృడత్వంతో శ్రమించి సత్తా చాటాలని అన్నారు. విశ్వవిద్యాలయానికి బహుమతులు తీసుకురావాలని కోరారు.

News January 20, 2026

KNR: ‘విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్ డబ్బులు చెల్లించాలి’

image

విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ త్వరితగతిన చెల్లించాలని ఎస్టీయూ నాయకులు జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజును కోరారు. ఈమేరకు సోమవారం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్‌కుమార్ డీటీఓను కలిసి విన్నవించారు. అలాగే కులగణన సర్వేలో పాల్గొన్న సిబ్బంది డబ్బులు కూడా సకాలంలో చెల్లించాలని వారు కోరారు.