News March 30, 2025
ఏలూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ ఉగాది శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి తొలి పండగ అయిన ఉగాదిని జిల్లా ప్రజలు ఆనందంతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, వెల్లివిరియాలని కోరారు. రైతులకు పాడిపంటలు బాగుండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 25, 2025
వరంగల్ సీపీగా అవినాశ్ మహంతి..?

వరంగల్ సీపీగా అవినాశ్ మహంతిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల్లో కొందరికి మింగుడు పడటం లేదని సమాచారం. ప్రభుత్వం మాత్రం లా అండ్ ఆర్డర్ను అదుపులో పెట్టేందుకు ఈ మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందని పోలీస్ గ్రూపులు, సోషల్ మీడియాలో చర్చగా మారింది. అయితే ఐజీ స్థాయి అధికారి వరంగల్కు వచ్చే అవకాశం ఉందా? అని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
News November 25, 2025
నక్కపల్లి: పెన్సిల్ ముల్లుపై అయ్యప్ప స్వామి

నక్కపల్లిలోని చిన్న దొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ బుక్లో చోటు సంపాదించిన గట్టెం వెంకటేశ్ పెన్సిల్ ముల్లుపై అయ్యప్ప స్వామి రూపాన్ని అద్భుతంగా చెక్కారు. చార్కోల్ పెన్సిల్ ముల్లుపై 16 మి.మీ పొడవు, 8మి.మీ వెడల్పున అయ్యప్ప స్వామిని తయారు చేశారు. తయారు చేసేందుకు తనకు 6 గంటల సమయం పట్టిందని వెంకటేశ్ తెలిపారు.
News November 25, 2025
GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభం

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్తో పాటు ఆయా పార్టీల MPలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొత్తం 46 అజెండాలపై సమావేశంలో చర్చలు జరపనున్నారు. జూబ్లీహిల్స్ MLA మాగంటి, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, అందెశ్రీ మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.


