News March 30, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శనివారం 1,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.55,000లు, ప్రసాద విక్రయాలు ద్వారా రూ.7,32,080లు VIP దర్శనాల ద్వారా రూ.1,20,000, బ్రేక్ దర్శనాలు రూ.1,19,100, కార్ పార్కింగ్ రూ.1,90,000, సువర్ణ పుష్పార్చన రూ.55,600, ప్రధాన బుకింగ్ రూ.90,450, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.20,42,139ల ఆదాయం వచ్చింది.
Similar News
News January 5, 2026
నిర్మల్: పుర పోరు.. సిద్ధమవుతున్న పార్టీలు

నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల్లో ఎన్నికల నగారా మోగకముందే రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BJP, BRS మున్సిపల్ పీఠాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అన్ని వార్డుల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు కసరత్తులు మొదలుపెట్టాయి. మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఛైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని ఆయా పార్టీల అధిష్ఠానాలు వ్యూహరచన చేస్తున్నాయి.
News January 5, 2026
అతి త్వరలోనే పెన్షన్ల పెంపు: మంత్రి

TG: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. అతి త్వరలోనే పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్పారు. దివ్యాంగులకు బస్సుల్లో త్వరలోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి బధిర విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ కాలేజీలను అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా దివ్యాంగుల పెన్షన్లను ₹4,016 నుంచి ₹6వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
News January 5, 2026
పాలమూరు: మున్సిపల్ ఎన్నికల వేళ.. నేతల ఆశలు

కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల కసరత్తు ముమ్మరం కావడంతో ఆశావహులు హైదరాబాద్కు క్యూ కడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో నాయకులు సంక్రాంతి తర్వాత చూద్దామని చెబుతుండగా, ఆశావహులు మాత్రం డివిజన్లలో రహస్యంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.


