News March 30, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శనివారం 1,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.55,000లు, ప్రసాద విక్రయాలు ద్వారా రూ.7,32,080లు VIP దర్శనాల ద్వారా రూ.1,20,000, బ్రేక్ దర్శనాలు రూ.1,19,100, కార్ పార్కింగ్ రూ.1,90,000, సువర్ణ పుష్పార్చన రూ.55,600, ప్రధాన బుకింగ్ రూ.90,450, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.20,42,139ల ఆదాయం వచ్చింది.

Similar News

News January 3, 2026

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: సంగారెడ్డి ఎస్పీ

image

జిల్లాలో ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పరితోష్ పంకజ్ హెచ్చరించారు. చైనా మాంజాను ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని చెప్పారు. దీనివల్ల ద్విచక్ర వాహనాదారులు, పాదాచారులు, పక్షులు గాయపడుతున్నారని చెప్పారు తెలిపారు. పతంగుల దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

News January 3, 2026

గద్వాల: ఆన్‌లైన్‌లో మున్సిపల్ ఓటర్ల జాబితా

image

గద్వాల జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల ఓటర్లు తమ వార్డు వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చని కలెక్టర్ సంతోష్ శనివారం తెలిపారు. ఓటర్లు https://urban2025.tsec.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ ఓటు ఏ మున్సిపాలిటీ, ఏ వార్డుకు మ్యాప్ అయిందో సులభంగా చూసుకోవచ్చని పేర్కొన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా సమాచారాన్ని తక్షణమే పొందేందుకు ఈ వెబ్ పోర్టల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించారు.

News January 3, 2026

జీర్ణశక్తిని పెంచే ఫ్రూట్స్ ఇవే..

image

శీతాకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఫైబర్, ఎంజైమ్స్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. నారింజ, కివి, దానిమ్మ, బొప్పాయి, జామపండు శీతాకాలంలో ఎక్కువగా తినాలి. ఇవి మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం తగ్గించడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అలాగే గ్రేప్‌ ఫ్రూట్‌, బెర్రీలు, బెర్రీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శీతాకాలంలో బరువు పెరగకుండా నిరోధిస్తాయంటున్నారు నిపుణులు.