News March 30, 2025

NRPT: ‘పండగలు శాంతియుతంగా చేసుకోవాలి’

image

పండుగలు కులమతాలకు అతీతంగా శాంతియుతంగా చేసుకోవాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం ప్రకటనలో అన్నారు. జిల్లా ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. పండగను ప్రజలంతా ఉత్సాహంగా ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకోవాలని అన్నారు. తీపి, చేదు, కష్ట సుఖాలు తెలిసిందే జీవితమని అన్నారు. పండగలకు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Similar News

News November 10, 2025

ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

image

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

News November 10, 2025

ప్రెగ్నెంట్లు పారాసిటమాల్ వాడొచ్చు: సైంటిస్టులు

image

గర్భిణులు పారాసిటమాల్ వాడితే పిల్లలకు ఆటిజమ్/ADHD వస్తుందనే వాదనకు ఆధారాలు లేవని బ్రిటిష్ మెడికల్ జర్నల్ వెల్లడించింది. ప్రెగ్నెంట్లు పారాసిటమాల్/ఎసిటమినోఫెన్ లాంటి పెయిన్ కిల్లర్లు వాడొద్దని ఇటీవల ట్రంప్ పిలుపునివ్వడంతో సైంటిస్టులు పరిశోధన చేశారు. ‘ప్రెగ్నెన్సీలో హై ఫీవర్ బిడ్డపై ప్రభావం చూపుతుంది. పారాసిటమాల్ సురక్షితమైన డ్రగ్. కచ్చితంగా తీసుకోవచ్చు’ అని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య తెలిపారు.

News November 10, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.17,900, వండర్ హాట్ (WH) మిర్చి రూ.17వేలు పలికింది. అలాగే, తేజ మిర్చి ధర రూ.14,800, దీపిక మిర్చి రూ.14వేలు, టమాటా మిర్చి రూ.30వేలు పలికిందని వ్యాపారులు చెప్పారు. 2043 రకం మిర్చికి రూ.22వేలు, 5531 రకం మిర్చికి రూ.15వేల ధర వచ్చింది.