News March 30, 2025

జనగామ: రైతాంగాన్ని ఆదుకోవాలని కలెక్టర్‌కు వినతి

image

జిల్లాలోని సాగు నీరు అందక పంట ఎండిపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా నాయకులు శనివారం కలెక్టర్ రిజ్వాన్ భాషాకు వినతిపత్రం అందజేశారు. ప్రతి రైతుకు 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శివరాజ్ యాదవ్, దేవరాయ ఎల్లయ్య, హరిచంద్రగుప్త, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 7, 2025

హనుమకొండ: MURDER అటెంప్ట్ కేసు.. టీచర్‌కు జైలు

image

ఉపాధ్యాయుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ముల్కనూర్ ఎస్ఐ రాజు తెలిపిన వివరాలు.. హసన్‌పర్తి(M) నాగారానికి చెందిన బానును హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న స్టాలిన్‌ ఇటీవల హత్య చేసేందుకు యత్నించాడు. బాను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరిపి, స్టాలిన్‌ను కోర్టు ఎదుట హాజరు పరిచారు. శుక్రవారం అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా జైలుకు తరలించారు.

News November 7, 2025

MP అకౌంట్ నుంచి ₹56 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు

image

TMC MP కళ్యాణ్ బెనర్జీ బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు ₹56L మాయం చేశారు. బెనర్జీ MLAగా ఉన్నప్పుడు కోల్‌కతాలోని SBI హైకోర్టు బ్రాంచిలో తీసిన అకౌంట్ చాలాకాలంగా ఇనాక్టివ్‌గా ఉంది. ఇటీవల నేరగాళ్లు మార్ఫ్‌డ్ పత్రాలు, ఫొటోలతో KYCలో ఫోన్ నంబర్‌ మార్చి డబ్బు మాయం చేశారు. MP ఫిర్యాదుతో అధికారులు కేసు పెట్టారు. ‘బ్యాంకులో ఉంచితే క్రిమినల్స్, ఇంట్లో ఉంచితే మోదీ తీసుకుంటారు’ అని బెనర్జీ విమర్శించారు.

News November 7, 2025

నూతనకల్: యాక్సిడెంట్‌లో ఒకరు మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నూతనకల్ మండల పరిధిలోని ఎర్రపహాడ్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. పెదనేమిల గ్రామానికి చెందిన కాసోజు మురళి, జంగం లాజర్ పోలుమల్ల నుంచి బైక్‌పై పెదనేమిల వెళ్తుండగా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మురళీ, లాజర్ తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్‌కు తరలించగా మురళి మృతి చెందాడు.