News March 30, 2025

అట్రాసిటీ కేసులను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్

image

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వెంటనే పరిష్కరించాలని అధికారులను సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేసిన భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 2, 2025

నిజామాబాద్ జిల్లా BRS నేతలతో KCR సమావేశం

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా BRS ముఖ్య నేతలతో KCR ఎర్రవల్లిలో సమావేశమయ్యారు. BRS రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల నేపథ్యంలో ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ బిగాల గుప్త, గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హనుమంత్ షిండే, NZB జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, KMR జిల్లా పార్టీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

News April 2, 2025

సింహాచలం అప్పన్న రథసారథికి ఆహ్వానం

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈనెల 8న జరగనుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ సహాయక కార్యనిర్వాహణాధికారి ఆనంద్ కుమార్ రథోత్సవానికి రథసారథి అయిన కదిరి లక్ష్మణరావును తన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కదిరి లక్ష్మణరావు వంశానికి చెందిన వారే దశాబ్దాలుగా రథోత్సవం సారథిగా ఉండడం అనవాయితీ.

News April 2, 2025

కొడాలి నాని హెల్త్ UPDATE

image

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆపరేషన్ కోసం ముంబై వెళ్లారు. అక్కడి ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ వైద్యులు ఆయనకు బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నాని కొద్దిరోజుల్లోనే డిశ్చార్జ్ కానున్నారు.

error: Content is protected !!