News March 30, 2025
GDWL: నేడు, రేపు పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

ఆది, సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో 30, 31 సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు.
Similar News
News January 15, 2026
సంగారెడ్డి: CHICKEN కోసం వెళ్లి మృతి

మాంజా తగిలి <<18856381>>వ్యక్తి మృతి<<>> చెందిన సంఘటన సంగారెడ్డిలో బుధవారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనుదీప్ (38) వరి కోతలు కోసేందుకు పసల్వాదికి వచ్చాడు. చికెన్ తీసుకురావడానికి సంగారెడ్డికి బైక్పై వెళ్లాడు. తిరిగి వస్తుండగా మాంజా >మెడపై తగిలి మరణించాడు. అనుదీప్ మెడకు తగిలింది చైనా మాంజా కాదని, మామూలుదేనని ఎస్ఐ తెలిపారు.
News January 15, 2026
కృష్ణా: కోడి పందేలలో ఇవే కీలకం?

కోడి పందేల విషయంలో వారాలు, రంగులు, దిశలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పందెం రాయుళ్లు విశ్వసిస్తున్నారు. ఆది, మంగళ డేగ, సోమ, శని నెమలి, బుధ, గురువారాల్లో కాకి. ఈ రోజుల్లో ఈ కోళ్లు గెలుపు సాధిస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే బరిలో కోడిని వదిలే దిశ కూడా కీలకమని చెబుతున్నారు. భోగి నాడు ఉత్తర దిశ, సంక్రాంతికి తూర్పు దిశ, కనుమ నాడు దక్షిణ దిశ నుంచి కోడిని దింపితే విజయం వరిస్తుందని శాస్త్రం చెబుతుందంట.
News January 15, 2026
HYDలో పోగులేస్తే మటన్కు ఎంత ఖర్చంటే!

సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఇంట్లో తునకలు ఉడకాల్సిందే. మటన్ కిలో రూ.1,000 దాటడంతో సామాన్యులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. 5- 6 కుటుంబాలు కలిసి ఓ మేకను కొని మాంసాన్ని కుప్పలుగా విభజించుకుంటున్నారు. దీంతో ఒక్కో ఫ్యామిలీకి రూ.1,400 వరకు ఖర్చైనా 2KG వరకు మటన్ వస్తుండటంతో ఈ విధానానికి ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఘట్కేసర్, మెట్, IBP తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం పోగుల పంపకాలు జోరుగా సాగుతున్నాయి.


