News March 30, 2025
ఒకే కుటుంబంలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు

ఇటీవల విడుదలైన పలు ప్రభుత్వ ఉద్యోగాల ఫలితాలలో కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పెనుమాడలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉద్యోగాలు సాధించారు. వారిలో ఇద్దరు అసిస్టెంట్ లోకో పైలట్, ఇద్దరు జిల్లా కోర్టులో ప్రాసెస్ సర్వర్, ఒకరు ఏపీ హైకోర్టులో సబర్డినేట్ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామంలో ఉంటూ ఉద్యోగాలు సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని పలువురు కొనియాడారు.
Similar News
News January 12, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు CM సంక్రాంతి కానుక

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డీఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న డీఏ మరో 3.64 శాతం పెరుగుతుంది. 2023 జులై నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.227 కోట్ల భారం పడనుంది. అటు ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
News January 12, 2026
విశాఖ: కొడుకుతో బైక్పై వెళుతున్న తల్లి.. ప్రమాదంలో మృతి

నగరంలోని బర్మా క్యాంపునకు చెందిన రమణి తన కొడుకుతో బైక్పై రమా టాకీస్ వైపు వెళుతుండగా బైక్ హ్యండిల్కు బస్సు తగలడంతో అదుపు తప్పి కిందపడ్డారు. అనంతరం RTC బస్సు వెనుక చక్రం ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో తల్లి మృతి చెందడంతో కుమారుడు నిశ్చేష్ఠుడయ్యాడు. తల్లి మృతదేహం వద్ద ఏడ్చిన తీరు కంటతడి పెట్టింది. ద్వారక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News January 12, 2026
మేడారం జాతర బ్రోచర్ను ఆవిష్కరించిన సీఎం

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మేడారం మహా జాతర బ్రోచర్, పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, గిరిజన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈనెల 18న మేడారానికి వస్తున్న సీఎం, 19న పూర్తయిన అభివృద్ధి పనులను ఆవిష్కరిస్తారు.


