News March 30, 2025

ఒకే కుటుంబంలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు

image

ఇటీవల విడుదలైన పలు ప్రభుత్వ ఉద్యోగాల ఫలితాలలో కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పెనుమాడలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉద్యోగాలు సాధించారు. వారిలో ఇద్దరు అసిస్టెంట్ లోకో పైలట్, ఇద్దరు జిల్లా కోర్టులో ప్రాసెస్ సర్వర్, ఒకరు ఏపీ హైకోర్టులో సబర్డినేట్ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామంలో ఉంటూ ఉద్యోగాలు సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని పలువురు కొనియాడారు.

Similar News

News November 15, 2025

త్వరలో GHMC ఉద్యోగుల బోగస్ హాజరుకు చెక్!

image

జీహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగుల బోగస్ హాజరు అరికట్టడం కోసం త్వరలోనే ఆటోమేటిక్ కాంటాక్ట్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు బల్దియా కసరత్తు చేస్తోంది. కార్యాలయాల్లోనూ అమలు చేసేందుకు ఇప్పటికే నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. తద్వారా రికార్డుల్లో లేకుండా వేతనాలు కాజేస్తున్న వారిని గుర్తించడం, జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతున్న వారి భరతం పట్టనున్నారు.

News November 15, 2025

VZM: కుష్టు వ్యాధిపై అవగాహన రథాన్ని ప్రారంభించిన DMHO

image

జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల 17 నుంచి 30 వరకు ఇంటింటి సర్వే ద్వారా కుష్టు కేసులను గుర్తించే “లెప్రసీ కేస్ డిటెక్షన్ కాంపెయిన్” జరగనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. జీవనరాణి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే ఆటో ప్రచార రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో ప్రజలు ఆరోగ్య కార్యకర్తలకు సహకరించాలన్నారు.

News November 15, 2025

గద్వాల్: డబుల్ ట్రాక్ లేక రైళ్ల ప్రయాణం ఆలస్యం

image

MBNR నుంచి కర్నూల్ వరకు 130 KM డబుల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం సింగిల్ ట్రాక్ ఉండటం వల్ల రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైళ్లు ఆగిపోయి, తీవ్రంగా ఆలస్యం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి రోడ్డు, శ్రీరాంనగర్, గద్వాల్, అలంపూర్ వెళ్లే ప్రయాణికులు ముఖ్యంగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.