News March 30, 2025

పాల్వంచ పెద్దమ్మ గుడి పాలకవర్గం.. భట్టిVSపొంగులేటి

image

పాల్వంచ పెద్దమ్మ గుడి పాలకవర్గం నియామకం Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య రాజకీయ ఆధిపత్యానికి దారి తీసింది. Dy.CM చొరవతో ఆలయ ఛైర్మన్‌గా జమ్ముల రాజశేఖర్, సభ్యులను నియమిస్తూ మార్చి 6న ఉత్తర్వులు వెలువడ్డాయి. తనకు తెలియకుండా ఎలా నియమిస్తారని మంత్రి సురేఖను పొంగులేటి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరో లిస్టు రెడీ చేశారని.. పాలకవర్గం నియామకం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

Similar News

News July 9, 2025

ఆరు బయట చెత్తను వేస్తే.. పరువు పోవడం పక్కా!

image

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దనే ఉద్దేశంతో మున్సిపాలిటీలు ఇంటింటికీ వెళ్లి చెత్తను కలెక్ట్ చేస్తుంటాయి. అయినప్పటికీ కొందరు బయటే చెత్త వేసి ఇతరులను ఇబ్బంది కలగజేస్తుంటారు. అలాంటివారికి బుద్ధి చెప్పాలని గుజరాత్‌లోని వడోదరా మున్సిపాలిటీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. రోడ్డు పక్కన చెత్త వేసేవారి ఫొటోలను తీసి పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇలా అయినా ప్రజలకు ఈ అలవాటును మార్చుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

News July 9, 2025

రేపు తల్లిదండ్రులు ఆడే ఆటలు ఇవే..

image

జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న 1,810 ప్రభుత్వ, 558 ప్రైవేటు స్కూల్స్, 140 జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు మెగా PTM జరుగుతుందన్నారు. వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులకు లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు ఉంటాయన్నారు.

News July 9, 2025

14న భూపాలపల్లిలో అప్రెంటిస్‌షిప్ మేళా

image

ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా(PMNAM)ను ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 14న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జుమ్లా నాయక్ తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న వారు తప్పనిసరిగా www.apprenticeshipindia.gov.in పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.