News March 30, 2025
సంగారెడ్డి: అంబులెన్స్, ట్రాక్టర్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

వికారాబాద్ నుంచి సంగారెడ్డికి వస్తున్న అంబులెన్స్ SRD జిల్లా కొండాపూర్(M) మల్కాపూర్ శివారులో ట్రాక్టర్ను ఢీకొన్న ఘటనలో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. వివరాలు.. VKB జిల్లా కోట్పల్లి(M) నాగ్సాన్ పల్లి వాసి మల్లమ్మకు మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలిస్తున్నారు. మల్కాపూర్ సమీపంలో ట్రాక్టర్ను ఓవర్ టెక్ చేసే క్రమంలో అంబులెన్స్ ఢీకొంది. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News January 8, 2026
విశాఖ: భవనం పైనుంచి పడి బాలిక మృతి

మల్కాపురం పీఎస్ పరిధిలో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి బాలిక మృతి చెందింది. జనతా కాలనీలో నివసిస్తున్న కనకరాజు కుమార్తె అమృత ఈ నెల 4న రెండో రెండో అంతస్తులో నిలబడి పక్కింటి వారితో మాట్లాడుతుండగా కింద నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించి ఆమె భవనం పైనుంచి తొంగి చూసింది. ఈ క్రమంలో పట్టు తప్పి బాలిక భవనంపై నుంచి కిందకు తూగి పడిపోయింది. తలకు గాయం అవడంతో కేజీహెచ్కు తరలించగా బుధవారం బాలిక మృతి చెందింది.
News January 8, 2026
అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

AP: రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. దీంతో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తాజాగా అమిత్ షాను CM CBN కోరారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెడితే చట్టబద్ధత లభిస్తుంది. తర్వాత కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదలవుతుంది.
News January 8, 2026
VZM: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

భోగాపురం మండలం నారుపేట జాతీయ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా బస్సులో ఉన్న సుమారు పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో సుందరపేట సీహెచ్సీకి, డ్రైవర్ను కేంద్రాసుపత్రికి తరలించారు.


