News March 30, 2025
విశాఖలో తండ్రిని చంపిన తనయుడు

విశాఖ శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పి అప్పారావు (82) ఆరిలోవ సెక్టార్- 2 డ్రైవర్స్ కాలనీలో నివసిస్తున్నాడు. తరచూ తన భార్యను తిట్టడం, కుమారుడు మీద పరుషపదజాలం వాడటం వంటివి చేస్తుంటాడు. కాగా శనివారం తన తల్లిని తండ్రి అప్పారావు కొట్టడంతో కోపోద్రిక్తుడైన కుమారుడు బాలయోగి బ్లేడుతో దాడి చేశాడు. దీంతో అప్పారావు చనిపోయారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News April 2, 2025
విజయనగరం: ‘ఉద్యాన పంటల సాగు పెంచేందుకు కార్యాచరణ’

విజయనగరం జిల్లాలో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు 15 రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత జిల్లా పరిస్థితులను బట్టి వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా జిడిపి పెంచేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఉద్యానసాగు, సూక్ష్మ సేద్యంపై కలెక్టర్ బుధవారం తమ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
News April 2, 2025
VZM: ‘మహిళల జీవనోపాధి కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలి’

మహిళలకు జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో చేపట్టేందుకు గల అవకాశాలపై ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు ఆదేశించారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష జరిపారు. మహిళలతో రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, లాభదాయక పంటల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదాయం పెంచే కార్యక్రమాలు చేయాలన్నారు.
News April 1, 2025
VZM: 10వ తరగతి పరీక్షకు 133 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయని డీఈవో మాణిక్యాలరావు తెలిపారు. సోషల్ పరీక్షకు 133 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. సోషల్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 22,862 మంది హాజరు కావాల్సి ఉండగా 22,774 మంది హాజరయ్యారన్నారు. రెగ్యులర్ 88 మంది విద్యార్థులు గైర్హాజరుకాగా, ప్రైవేటు విద్యార్థులు 116మందికి గాను 45 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.