News March 30, 2025

పిఠాపురం పోలీసులపై జిల్లా ఎస్పీ సీరియస్

image

ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలపై కాకినాడ జిల్లా ఎస్పీ విందు మాధవ్ పిఠాపురం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం రూరల్ ఎస్‌ఐ లంచం తీసుకోవడం, ఒక కేసులో అనుమానితుడు జీపు డ్రైవర్‌గా ఉండటం పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఎక్కువగా ఉండటం, కొన్ని కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడంపై ఎస్పీ బిందు మాధవ్ పిఠాపురం పోలీసులపై సీరియస్ అయ్యారు.

Similar News

News November 4, 2025

న్యూస్ అప్‌డేట్స్

image

* TG: 1,037 ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ G.O. జారీ. 2026 మార్చి 31 వరకు వారు విధుల్లో కొనసాగనున్నారు.
* తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్‌ను కోరిన సీఎం రేవంత్
* సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను సహించం: ఏపీ హోంమంత్రి అనిత
* మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని TG సర్కార్ ఆదేశం

News November 4, 2025

APPLY NOW: NRDCలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(<>NRDC<<>>)3 అసిస్టెంట్ మేనేజర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఈ/ఎంటెక్, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://www.nrdcindia.com

News November 4, 2025

ఉప్పలగుప్తం: నాచుతో డబ్బులే డబ్బులు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు మరో రెండు జిల్లాలను సముద్రపు నాచు పెంపకానికి ఎంపిక చేసినట్లు అమృతానంద విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అమృత నటరాజన్ తెలిపారు. నాచును ఆహారంగా తీసుకుంటున్న జపాన్ దేశస్థుల ఆయుష్షు పెరిగినట్టు సర్వేలు వెల్లడించాలని ఆయన అన్నారు. ఉప్పలగుప్తం(M) వాసాలతిప్పలో సోమవారం మత్స్యకారులకు నాచు పెంపకంపై అవగాహన కల్పించారు. ఎరువులు వాడకుండానే 45 రోజులకు నాచు ఉత్పత్తి వస్తుందని వివరించారు.