News March 30, 2025
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ హైదరాబాద్, నల్గొండ, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో కిలో చికెన్ రూ.230- రూ.260 వరకు విక్రయిస్తున్నారు. వరుస సెలవుల సందర్భంగా డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరను పెంచి అమ్మకాలు చేస్తున్నారు. గత వారం బర్డ్ ఫ్లూ వ్యాప్తి, భయంతో చికెన్ కొనుగోళ్లు పడిపోగా కిలో రూ.150కే అమ్మారు. మీ ప్రాంతంలో కిలో చికెన్ ధర ఎంత ఉందో COMMENT చేయండి.
Similar News
News December 29, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ గడ్డి పెంపకం

చాలా మంది రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని జీవాలకు ఇస్తున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పశువుల్లో పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం’ అందుబాటులోకి వచ్చింది. నేపియర్తో పోలిస్తే చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. దీన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది.
News December 29, 2025
ఇవాళ అసెంబ్లీలో..

TG: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కాసేపట్లో మొదలు కానున్నాయి. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దివంగత సభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. అనంతరం సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయమై BAC నిర్ణయం తీసుకోనుంది. JAN 2న కృష్ణా, 3న గోదావరి బేసిన్ జలాలపై చర్చ జరగనుంది. కాగా 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని BRS పట్టుబడుతోంది.
News December 29, 2025
యుద్ధ మేఘాలు: US-తైవాన్ డీల్కు కౌంటర్గా చైనా సైనిక విన్యాసాలు

చైనా సైన్యం తైవాన్ చుట్టూ ‘జస్టిస్ మిషన్ 2025’ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలు మొదలుపెట్టింది. తైవాన్ పోర్టులను దిగ్బంధించి పట్టు నిరూపించుకోవాలని చూస్తోంది. తైవాన్ స్వాతంత్ర్య కాంక్షకు ఇదొక హెచ్చరిక అని చెబుతోంది. తైవాన్తో $11 బిలియన్ల ఆయుధ డీల్కు US ఓకే చెప్పిన 11 రోజులకే చైనా ఈ స్టెప్ తీసుకుంది. దీనికి కౌంటర్గా తైవాన్ రెస్పాన్స్ సెంటర్ ఏర్పాటు చేసి తన సైన్యాన్ని అలర్ట్ చేసింది.


