News March 30, 2025
సంగారెడ్డి: ఉగాది ఆధ్యాత్మిక ఆనందం: అవధూత గిరి

ప్రశాంతతకు ప్రకృతికి నిలయమైన బర్దిపూర్ దత్త క్షేత్రంలో ఆదివారం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ తెలుగు ప్రజలకు శ్రీ విశ్వ వసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
Similar News
News July 6, 2025
కెప్టెన్ శుభ్మన్ గిల్ కిట్పై వివాదం?

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కిట్పై వివాదం నెలకొంది. భారత జట్టుకు ప్రస్తుతం అడిడాస్ స్పాన్సరర్గా వ్యవహరిస్తోంది. కానీ నిన్న ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ నైక్ టీ షర్ట్ ధరించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. మ్యాచ్ జరిగే సమయంలో స్పాన్సర్ కిట్ను కాదని ఇతర కిట్స్ ఉపయోగించడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
News July 6, 2025
జగిత్యాల: విద్య, వైద్యంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

జగిత్యాల జిల్లాలో విద్య, వైద్యంపై కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ ఆయన ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తూ వైద్యులు సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అందుబాటులో మందులు ఉంచుకోవాలని చెబుతూ అప్రమత్తం చేస్తున్నారు.
News July 6, 2025
పాశమైలారం: 43కు చేరిన మృతుల సంఖ్య

పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఆదివారానికి 43కి చేరింది. డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతులకు పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. పరిశ్రమ వద్ద ఏడో రోజు కూడా సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. తమ వాళ్ల మృతదేహాలను ఎప్పుడు అప్పగిస్తారని కుటుంబసభ్యులు ఆసుపత్రుల వద్ద ఎదురుచూస్తున్నారు.