News March 30, 2025

ఏప్రిల్ నుంచి ఉచితంగా రూ.5 లక్షల బీమా

image

TG: రాష్ట్రంలో 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్థిక పరిమితులతో సంబంధం లేకుండా ఏప్రిల్ నుంచి ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ అమలు కానుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది. ట్రీట్మెంట్, సర్జరీలు, మెడిసన్ ఖర్చులన్నీ కలిపి ఆ మొత్తానికి ఉచిత వైద్యం పొందొచ్చు. ఈ స్కీమ్ అమలుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య అధికారులు TGలోని 416 నెట్‌వర్క్ ఆస్పత్రులకు తాజాగా ఆదేశాలిచ్చారు.

Similar News

News September 11, 2025

దాడులకు కుట్ర.. టెర్రరిస్టుల అరెస్టు

image

ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐదుగురు టెర్రరిస్టులను అరెస్టు చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, తెలంగాణలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో తెలంగాణలోని బోధన్‌కు చెందిన ఓ యువకుడూ ఉన్నాడు. ఇటీవల రాంచీలో కుట్రలు పన్నుతున్న డ్యానిష్‌ను అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఐదుగురిని పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ చేసింది.

News September 11, 2025

రూ.78వేల జీతంతో RBIలో జాబ్స్

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 120 ఆఫీసర్ గ్రేడ్-బీ (జనరల్, డీఈపీఆర్, డీఎస్ఐఎం) పోస్టుల భర్తీకి <>దరఖాస్తుల<<>> స్వీకరణ కొనసాగుతోంది. పోస్టులను బట్టి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ పాసైన వారు అర్హులు. వయసు 21-30 మధ్య ఉండాలి. బేసిక్ పే నెలకు రూ.78,450 ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30. వెబ్‌సైట్: https://opportunities.rbi.org.in/

News September 11, 2025

వార్డ్‌రోబ్ నుంచి వాసన వస్తోందా?

image

వర్షాకాలంలో దుస్తులు ఆరడం పెద్ద సమస్య. ఆరడానికి చాలాసమయం పట్టడంతో పాటు, అదోరకమైన వాసన వస్తుంది. ఇలాకాకుండా ఉండాలంటే దళసరి, పల్చటి బట్టలను వేర్వేరుగా ఉతికి, ఆరేయాలి. నానబెట్టే ముందు సర్ఫ్‌లో కాస్త బేకింగ్ సోడా, నిమ్మరసం కలపాలి. సువాసన కోసం కండీషనర్స్ బదులు రోజ్ వాటర్ కలిపిన నీటితో జాడించి ఆరేయాలి. వార్డ్‌రోబ్‌లో రోజ్మెరీ, నాఫ్తలీన్ బాల్స్, సిలికాజెల్ ప్యాకెట్స్ పెడితే దుర్వాసన రాకుండా ఉంటుంది.