News March 30, 2025
కరీంనగర్: మండలాల వారీగా సమన్వయకర్తల నియామకం

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(AICC) దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ఏప్రిల్ 2 నుండి జిల్లాలో నిర్వహిస్తున్నందున ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మండలాల వారీగా సమన్వయకర్తలను నియమించారు. వీరు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలతో, మండల కాంగ్రెస్ అధ్యక్షులతో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో భారత రాజ్యాంగం, పరిరక్షణ స్వాతంత్రం గురించి ప్రజలకు వివరించనున్నారు.
Similar News
News January 9, 2026
కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రిమెట్రిక్ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సుగుణ తెలిపారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఈపాస్ వెబ్సైట్ ద్వారా మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా సంక్షేమ కార్యాలయంలో అందజేయాలన్నారు.
News January 9, 2026
కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రిమెట్రిక్ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సుగుణ తెలిపారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఈపాస్ వెబ్సైట్ ద్వారా మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా సంక్షేమ కార్యాలయంలో అందజేయాలన్నారు.
News January 9, 2026
KNR: ‘యూరియా నిల్వలు పుష్కలం..: ఆందోళన వద్దు’

కరీంనగర్ జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత పది రోజుల్లోనే వివిధ సొసైటీల ద్వారా 6,513 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 1,833 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అవసరానికి తగినట్లుగా ఎరువులను తెప్పిస్తున్నామని, రైతులు తమ అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించారు.


