News March 30, 2025
నితీశ్ కుమార్ రెడ్డి డక్ అవుట్

విశాఖ వేదికగా జరుగుతున్న ఢిల్లీ-SRH మ్యాచ్లో లోకల్ బాయ్ నితీశ్ కుమార్ రెడ్డి నిరాశ పర్చారు. రెండు వికెట్లు పడ్డ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్.. స్టార్క్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి డక్ అవుట్ అయ్యారు.
Similar News
News April 2, 2025
వనపర్తి: ‘పండిత్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ నంబర్ కేటాయించాలి’

డీఎస్సీ 2002 హిందీ పండిట్గా కోర్టు ఉత్తర్వుల ద్వారా ఆలస్యంగా నియమితులైన జిల్లాలోని 8 మంది ఉపాధ్యాయులకు హైకోర్టు ఉత్తర్వుల కనుగుణంగా పాత పెన్షన్ వర్తించేలా జీపీఎఫ్ నంబర్ కేటాయించాలని విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని ద్వారా ప్రొసీడింగ్స్ ఇప్పించాలని కోరుతూ తపస్ బృందం జడ్పీ డిప్యూటీ సీఈవోకు ఈరోజు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్, సతీశ్ కుమార్, శశివర్ధన్ పాల్గొన్నారు.
News April 2, 2025
విశాఖలో హత్యకు గురైన విజయనగరం మహిళ

విశాఖపట్నం కొమ్మాది స్వయంకృషినగర్లో ప్రేమోన్మాది నవీన్ చేసిన దాడిలో గాయపడ్డ నక్కా దీపిక(20) ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఘటనా స్థలంలోనే ఆమె తల్లి లక్ష్మి (43) మృతి చెందింది. రేగిడి మండలం పుర్లికి చెందిన బాధితురాలి తండ్రి రాజు విశాఖ వలస వచ్చి కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొమ్మాదిలోని స్వయంకృషినగర్లో అద్దెకు ఉంటున్నారు. యువతి పెళ్ళికి అంగీకరించకపోవటంతో హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు.
News April 2, 2025
వచ్చే ఐదేళ్లలో 20వేల స్టార్టప్ల స్థాపనే లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP: ప్రభుత్వం తలపెట్టిన ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’, ‘వన్ ఫ్యామిలీ-వన్ ఆంత్రప్రెన్యూర్’ సంకల్పాల్ని నిజం చేసేందుకు అందరూ ముందుకురావాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘AP నుంచి కొత్తగా పారిశ్రామిక వేత్తలు రావాలి. ఆవిష్కరణలకు AP హబ్ కావాలి. అందరిలోనూ స్ఫూర్తి నింపేందుకే ఇన్నోవేషన్ హబ్కు రతన్ టాటా పేరు పెట్టాం. వచ్చే ఐదేళ్లలో 20వేల స్టార్టప్స్ స్థాపించడమే లక్ష్యం’ అని పేర్కొన్నారు.