News March 30, 2025
కాంట్రాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త

AP: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఇందులో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తామని, సుమారు 17 వేల మందికి రూ.2వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. గత 3, 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, ఇరిగేషన్, నాబార్డు పనులకు పేమెంట్స్ చేస్తామని వివరించారు.
Similar News
News November 18, 2025
ఇతరులకు ఇబ్బంది కలిగించకపోతేనే వాస్తు ఫలితాలు

మనం మన పరిధిలో, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. కేవలం మన సౌకర్యమే కాక, సామాజిక ధర్మాన్ని కూడా పాటించడం ముఖ్యమంటున్నారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా నిర్మాణాలు చేయడం వల్ల శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా అందరికీ శుభం, శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 18, 2025
ఇతరులకు ఇబ్బంది కలిగించకపోతేనే వాస్తు ఫలితాలు

మనం మన పరిధిలో, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. కేవలం మన సౌకర్యమే కాక, సామాజిక ధర్మాన్ని కూడా పాటించడం ముఖ్యమంటున్నారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా నిర్మాణాలు చేయడం వల్ల శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా అందరికీ శుభం, శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 17, 2025
గిగ్ వర్కర్ల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

TG: గిగ్, ప్లాట్ఫామ్ ఆధారిత వర్కర్లకు సామాజిక భద్రత, భరోసా కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజీ డెలివరీల్లో పనిచేస్తున్న 4 లక్షల మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంది. గిగ్ వర్కర్లు వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి వివేక్ సూచించారు. త్వరలో అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు.


