News March 30, 2025

కాంట్రాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త

image

AP: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఇందులో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తామని, సుమారు 17 వేల మందికి రూ.2వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. గత 3, 4 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, ఇరిగేషన్, నాబార్డు పనులకు పేమెంట్స్ చేస్తామని వివరించారు.

Similar News

News April 3, 2025

IPL: టాప్‌-3లో ధోనీ, కోహ్లీ, రోహిత్

image

మార్చిలో Xలో అత్యధికంగా ప్రస్తావించిన ఐపీఎల్ ప్లేయర్ల లిస్టులో CSK మాజీ కెప్టెన్ ధోనీ తొలి స్థానంలో నిలిచారు. నెటిజన్లు గత నెలలో ఆయన గురించే ఎక్కువగా చర్చించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, SRH హిట్టర్ ట్రావిస్ హెడ్ ఉన్నారు.

News April 2, 2025

అదంతా అబద్ధం: సూర్య కుమార్

image

<<15971972>>జైస్వాల్‌తో పాటు<<>> తాను కూడా ముంబై నుంచి గోవా జట్టుకు మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సూర్య కుమార్ యాదవ్ ఖండించారు. ‘మీరు జర్నలిస్టులా? స్క్రిప్ట్ రైటర్లా? నేను కామెడీ సినిమాలు చూడటం మానేసి ఇక నుంచి మీ ఆర్టికల్స్ చదువుతా’ అంటూ X వేదికగా స్పందించారు. సూర్యతో పాటు మరికొంత మంది క్రికెటర్లు గోవా జట్టులో చేరుతారని, HYD క్రికెటర్ తిలక్ వర్మనూ గోవా క్రికెట్ అసోసియేషన్ సంప్రదించినట్లు వార్తలొచ్చాయి.

News April 2, 2025

UPI పేమెంట్స్ చేసేవారికి మళ్లీ షాక్

image

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్‌లో యూపీఐ పేమెంట్స్ మరోసారి నిలిచిపోయాయి. గతవారం కూడా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్డ్ కాగా ఇవాళ సాయంత్రం నుంచి పేమెంట్స్ కావడం లేదంటూ యూజర్లు సోషల్ మీడియాలో తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో పంపుతున్న డబ్బులు ప్రాసెసింగ్‌లో పడి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడుతున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? కామెంట్ చేయండి.

error: Content is protected !!