News March 30, 2025
సూర్యాపేట: కేంద్రమంత్రి బండి సంజయ్పై మంత్రి సీతక్క ఫైర్

రాష్ట్రానికి కాంగ్రెస్ కరప్షన్ వైరస్ సోకిందని, రాష్ట్రంలో సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో హుజూర్ నగర్కు వెళ్తుండగా మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12సంవత్సరాల్లో సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదో చెప్పాలన్నారు.
Similar News
News April 3, 2025
మారుతీ కార్లు కొనేవారికి షాక్

ఏప్రిల్ 8 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. మోడల్ను బట్టి రూ.2,500 నుంచి రూ.62,000 వరకు ఈ పెంపు ఉంటుందని తెలిపింది. ముడి సరకుల ధరలు, ఆపరేషనల్ కాస్ట్ పెరగడం, కార్లలో మెరుగైన ఫీచర్స్ ఇందుకు కారణమని తెలిపింది. మోడళ్లపై ధరల పెరుగుదల ఇలా ఉంది. SUV Fronx-Rs.2500, Dzire Tour S-Rs.3000, XL6, Ertiga-Rs.12,500, Wagon R-Rs.14000, Eeco van-Rs.22,500, SUV Grand Vitara-Rs.62,000.
News April 3, 2025
MBNR: ‘హాని కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలి’

గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండటంపై వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ మెరూకు MBNR బీఆర్ఎస్ నేత ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అరణ్య భవన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో చట్టాలను ఉల్లంఘించి, వివిధ జంతు, వృక్ష జాతుల మనుగడకు హాని కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలని వినతిపత్రంలో బీఆర్ఎస్ నేతలు కోరారు.
News April 3, 2025
ఇరిగేషన్ మంత్రి నిమ్మలతో బత్తుల భేటీ

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకొల్లులోని వారి క్యాంపు కార్యాలయంలో మంత్రితో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాలో వివిధ సమస్యలపై మంత్రితో చర్చించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, గ్రోయిన్లకి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.