News March 30, 2025
నరసరావుపేట: జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని కోరారు.
Similar News
News November 15, 2025
వంటింటి చిట్కాలు

* ఇన్స్టంట్ కాఫీపొడిని గాలి తగలని డబ్బాలో వేసి డీప్ఫ్రిజ్లో ఉంచితే ఎంత కాలమైనా గడ్డ కట్టదు.
* కోడిగుడ్డు సొనలో కొద్దిగా నీళ్లు కలిపి వేస్తే ఆమ్లెట్ మెత్తగా వస్తుంది.
* స్టీల్ గ్లాస్లు, గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయినపుడు పై గ్లాసును చల్లటి నీటితో నింపి, వేడినీటిలో ఉంచితే ఈజీగా వచ్చేస్తాయి.
* పాస్తా ముద్దలా అవ్వకూడదంటే ఉడికించేటపుడు చెక్క స్పూన్/ ఫోర్క్ వేస్తే సరిపోతుంది.
News November 15, 2025
HYD: హడలెత్తిస్తున్న సైబర్ మోసాలు

మనుషుల ప్రాణాలను సమస్త లోకాలకు పంపుతున్న సైబర్ నేరాలు ఇప్పుడు కొత్త దారులు వెతుకుతోంది. సైబర్ అంటేనే ప్రస్తుతం గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. మాయమాటలు చెప్పి మత్తెకించి వేలిముద్రలు తీసుకుంటున్నారు. HYDలో ప్రతీ విషయం పట్ల జాగ్రత్త పడాలని పోలీసులు సూచించారు. ఇన్ని రోజులు దొంగలు పడితే భయపడేవారు కానీ..ఇప్పుడు మొబైల్, ఎకౌంట్లో దొంగలు పడుతున్నారు.
News November 15, 2025
ఈ ఆయుర్వేద ఉత్పత్తులతో లివర్కు ప్రమాదం: డా.ఫిలిప్స్

అధిక ఆర్సెనిక్, పాదరసం ఉన్న ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగంతో కాలేయానికి నష్టమని డాక్టర్ అబీ ఫిలిప్స్ రాసిన ఆర్టికల్ను మెక్గిల్ విశ్వవిద్యాలయం(కెనడా) ప్రచురించింది. ఈ లోహాల విషప్రభావం కాలేయాన్ని దెబ్బతీయడంతో పాటు ఆరోగ్య సమస్యలు తెస్తుందని ఆయన తెలిపారు. ఈ ఉత్పత్తులపై నాణ్యత, నియంత్రణ లేకపోవడమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. వీటిని ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


