News March 30, 2025

బైక్ ఎక్స్‌పెడిషన్ బృందానికి స్వాగతం

image

250వ AOC కార్పస్ డేను పురస్కరించుకుని బయలుదేరిన బైక్ ఎక్స్‌పెడిషన్ బృందాన్ని CAD పులగాన్ వద్ద ఉత్సాహంగా స్వాగతించారు. ఈ బృందం సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు 2200 కి.మీ ప్రయాణించి మార్గమధ్యలో వీర నారులు, వేటరన్లు, విద్యార్థులతో పరస్పర కలయిక సాధించనుంది. ఆ తర్వాత వీరిని అధికారికంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు.

Similar News

News April 3, 2025

HEADLINES

image

వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు: అమిత్ షా
AP: వచ్చే ఐదేళ్లలో 20వేల స్టార్టప్‌ల స్థాపనే లక్ష్యం: CM CBN
AP: వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తాం: జగన్
TG: HCU భూములపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
TG: బీసీల డిమాండ్‌ను బీజేపీ పట్టించుకోవాలి: CM రేవంత్
TG: LRS రాయితీ గడువు పొడిగింపు
TG: భవిష్యత్ తరాల కోసం HYDని నాశనం చేస్తారా?: KTR

News April 3, 2025

ఆరు నెలల్లో రెండు ఎయిర్‌పోర్టులు సాధించాం: కోమటిరెడ్డి

image

TG: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు IAF గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 6 నెలల్లో 2 ఎయిర్‌పోర్టులు(మామునూర్, ఆదిలాబాద్) సాధించడం తమ ప్రభుత్వ కృషికి దక్కిన ఫలితమన్నారు. ఎయిర్‌పోర్టుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందేలా IAFతో కలిసి తదుపరి కార్యాచరణపై నివేదిక రూపొందిస్తామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రామ్మోహన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

News April 3, 2025

IPL: ఆర్సీబీ ఓటమి

image

బెంగళూరులో ఆర్సీబీతో మ్యాచ్‌లో170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 2 వికెట్ల నష్టానికి సునాయాస విజయాన్ని సాధించింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 49), బట్లర్(39 బంతుల్లో 73) రాణించడంతో 17.5 ఓవర్లలోనే స్కోర్ ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, హేజిల్‌వుడ్ చెరో వికెట్‌ తీసుకున్నారు.

error: Content is protected !!