News March 30, 2025

పండగలు మన దేశ సంస్కృతిలో భాగం – CM

image

పండగలు భారతదేశ సంస్కృతిలో భాగమని సీఎం చంద్రబాబు అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో నిర్వహించిన ఉగాది సంబరాల్లో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమాజ బాగు కోసం తపనపడే వ్యక్తి అని కితాబు ఇచ్చారు. ట్రస్ట్ నడపడం అంటే సాధారణ విషయం కాదని, స్వర్ణ భారత్ ట్రస్ట్ యువతలో స్ఫూర్తిని నింపుతోందన్నారు.

Similar News

News April 3, 2025

క‌ష్ణా జిల్లాలో పర్యటించిన కలెక్టర్ 

image

కృష్ణా జిల్లాలోని పలుమండలాలతో పాడు పెదపారుపూడి మండలం భూషనగుళ్ల, మహేశ్వరపురంలోని బాలురు, బాలికల పాఠశాలలను బుధవారం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

News April 2, 2025

మచిలీపట్నం: పారిశుద్ధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి – కలెక్టర్

image

మచిలీపట్నం నగరంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్లో మున్సిపల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ పారిశుద్ధ్య చర్యలపై చర్చించారు. నగరంలో మార్కెట్ యార్డు, లేడీయాంప్తిల్ కళాశాల, పద్మావతి మహిళా కళాశాల తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ టీవీలు ఎలా పని చేస్తున్నాయో మొబైల్ ద్వారా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

News April 1, 2025

కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

image

☞కృష్ణా : ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు
☞జూన్‌లో విజయవాడ వెస్ట్ బైపాస్ ఓపెన్
☞ ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణా: చిన్నారి మృతి.. హృదయ విదారకం
☞ఉంగుటూరు: వారిని పట్టిస్తే రూ.10 వేలు
☞కృష్ణా: జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
☞కృష్ణా: Way2Newsతో మాట్లాడిన10th విద్యార్థులు
☞ గన్నవరం: వంశీకి షాక్.. రిమాండ్ పొడిగింపు

error: Content is protected !!