News March 30, 2025

విషాదం.. ఆరుగురి మృతి

image

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ గాలులు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు మరణించారు. కులు సమీపంలోని పర్యాటక ప్రాంతంలో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. వాటితో పాటు రాళ్లు, శిథిలాలు ఓ వ్యానుతో పాటు అక్కడ కూర్చున్న పర్యాటకులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.

Similar News

News January 10, 2026

ఇకపై Xలో అవి క్రియేట్ చేయలేరు!

image

గ్రోక్‌ను ఎడాపెడా వాడేస్తున్న యూజర్లకు ‘X’ షాక్ ఇచ్చింది. అసభ్య, అశ్లీల కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం <<18795355>>సీరియస్‌<<>> అయిన విషయం తెలిసిందే. దీంతో సదరు సంస్థ పలు పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కేవలం సబ్‌స్క్రైబర్లు మాత్రమే ఈ ఫీచర్‌ ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల ‘ఎక్స్‌’ అధినేత ఎలాన్‌ మస్క్‌ Grokను దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని యూజర్లను హెచ్చరించారు.

News January 10, 2026

శంఖం పూలకు పెరుగుతున్న డిమాండ్

image

ఇప్పటివరకు పెరట్లో పూసే మొక్కగా మాత్రమే చూసిన శంఖం పూలు ఇప్పుడు రైతులకు ఆదాయ మార్గంగా మారుతున్నాయి. సహజ రంగులు, హెర్బల్ టీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ఈ పూల సాగు భారీగా పెరుగుతోంది. అస్సాం, UP, WB రాష్ట్రాల్లో మహిళా రైతులు ఈ పంటతో మంచి లాభాలు పొందుతున్నారు. టీ, డై తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తున్న వీటికి అమెరికా, యూరప్‌ మార్కెట్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.

News January 10, 2026

తమీమ్-బీసీబీ మధ్య మాటల యుద్ధం

image

T20 వరల్డ్ కప్ భారత్‌లో కాకుండా న్యూట్రల్ వేదికల్లో పెట్టాలంటూ <<18761652>>BCB<<>> కోరిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ అంశం బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర వివాదానికి దారి తీసింది. ‘మనకు ఎక్కువ ఆదాయం ICC నుంచే వస్తోంది కాబట్టి భవిష్యత్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి’ అని బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్‌ తమీమ్ ఇక్బాల్ సూచించారు. దీనిపై బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లాం తమీమ్‌ “ఇండియన్ ఏజెంట్” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.