News March 30, 2025
యాదాద్రి దేవస్థానం పంచాంగాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం పంచాంగాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పలువురు మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నరసింహమూర్తిని ఘనంగా సన్మానించారు.
Similar News
News March 2, 2026
రంగుల పండుగను శాంతియుతంగా జరుపుకోండి: కలెక్టర్

జగిత్యాల జిల్లా ప్రజలకు హోలీ పండుగ సందర్భంగా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యత, స్నేహభావం పెంపొందించే పండుగ హోలీ అని పేర్కొన్నారు. ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు. హానికర రసాయన రంగులు వాడకుండా సహజ రంగులతో వేడుకలు నిర్వహించాలని తెలిపారు. నీటి వృథాను నివారిస్తూ, భద్రతా నియమాలు పాటించాలని, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
News March 2, 2026
నిర్మల్: రైతులకు 1,40,000 యూరియా బస్తాలు అందజేత

జిల్లాలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభమైన యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటివరకు రైతులు 1,60,000 వేల యూరియా బస్తాలు బుక్ చేసుకోగా 1,40,000 బస్తాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 2, 2026
ఖమేనీ అధీనంలో రూ.8.55లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం?

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సుమారు $95B (₹8.55లక్షల కోట్లు) విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తొలి సుప్రీం లీడర్ ఖొమేనీ స్థాపించిన ‘సెటాడ్’ అనే రహస్య సంస్థ పరిధిలో ఇది ఉందని పేర్కొంది. ప్రజల ఆస్తులను జప్తు చేసి విక్రయించేవారని, ప్రతి రంగంలో ‘సెటాడ్’కి వాటాలున్నాయని ఆరోపించింది. అయితే ఖమేనీ తాను రిచ్ అయ్యేందుకు సెటాడ్ను వాడుకున్నారనేందుకు ఆధారాల్లేవని పేర్కొంది.


