News March 31, 2025

ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం

image

ఐపీఎల్‌లో భాగంగా సీఎస్కేతో జరిగిన ఉత్కంఠ మ్యాచులో ఆర్ఆర్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 176/6 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రుతురాజ్ (63) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 4, ఆర్చర్, సందీప్ శర్మ ఓ వికెట్ తీశారు. ఈ సీజన్‌లో ఆర్ఆర్‌కు ఇదే తొలి విజయం. సీఎస్కేకు వరుసగా రెండో ఓటమి.

Similar News

News April 3, 2025

జనాలను ఫూల్స్ చేస్తున్న చంద్రబాబు: రోజా

image

AP: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు జనాలను ఫూల్స్ చేస్తున్నారని వైసీపీ నేత రోజా విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడం చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని ఆమె డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ఈవీఎంలను మేనేజ్ చేస్తారు కానీ కరువును మాత్రం చేయలేకపోతున్నారు. కరువుతో చాలా జిల్లాలు అల్లాడిపోతున్నా పట్టించుకోవడం లేదు. బాబు చెప్పే మాటలకు, చేసే పనులకు అసలు సంబంధమే లేదు’ అని ఆమె ఫైర్ అయ్యారు.

News April 3, 2025

ఏప్రిల్ 3: చరిత్రలో ఈరోజు

image

1955: ప్రముఖ నేపథ్య గాయకుడు హరిహరన్ జననం
1962: నటి జయప్రద జననం
1973: నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా జననం
1964: భారత మాజీ క్రికెటర్ అజయ్ శర్మ జననం
1680: మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మరణం
1973: కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా జననం
1973: భారత మాజీ క్రికెటర్ నీలేష్ కులకర్ణి జననం

News April 3, 2025

జైస్వాల్ ముంబైని వీడటానికి కారణం అదేనా?

image

యువ క్రికెటర్ జైస్వాల్ <<15967764>>ముంబైని వీడి గోవా జట్టులో<<>> చేరనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముంబై టీమ్‌తో ఆయనకు ఏర్పడిన విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. క్రికెట్ వర్గాల ప్రకారం.. ముంబై-విదర్భ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌కి జైస్వాల్ మోకాలి నొప్పి పేరిట దూరమయ్యారు. ఆ మ్యాచ్‌లో ముంబై ఓడింది. దాంతో అసోసియేషన్ పెద్దలకు, జైస్వాల్‌కు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

error: Content is protected !!