News March 31, 2025
నిజామాబాద్ జిల్లాలో దంచికొడుతున్న ఎండలు..

నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం కోటగిరిలో 41℃, కమ్మరపల్లి, బోధన్, మెండోరా 40.9, పొతంగల్ 40.8, వేల్పూర్ 40.7, సాలూర, ఇందల్వాయి, డిచ్పల్లి 40.6, మక్లూర్, ఎడపల్లి, ఆర్మూర్ 40.5, ధర్పల్లి, నిజామాబాద్ 40.4, ముగ్పాల్ 40.4, నందిపేట్ 40.3, రెంజల్, మోస్రా 40.2, బోధన్లో 40.1℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.కాగా ఈ ప్రాంతాలన్నీ ఆరెంజ్ జోన్లో ఉన్నాయి.
Similar News
News April 3, 2025
ఆర్మూర్: భూములను యూనివర్సిటీకి అప్పగించండి: ఎంపీ

BRS పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే పరిస్థితిపై వివరించారు. భూములు ప్రైవేట్ పరుల చేతుల్లో వెళ్లకుండా 400 ఎకరాలు భూమిని కాపాడాలని కోరారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని కోరారు. విద్యార్థులుపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
News April 3, 2025
NZB: LRS గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

LRS రిబేట్ గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం జిల్లా ప్రజలకు సూచించారు. అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన LRS 25 శాతం రాయితీ సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించిందని తెలిపారు. మార్చి 31వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం పొడిగించిందన్నారు.
News April 3, 2025
NZB: కాంగ్రెస్, బీజేపీలపై MLC కవిత ధ్వజం

X వేదికగా కాంగ్రెస్, బీజేపీలపై బుధవారం నిజామాబాద్ MLC కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను కోల్డ్ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లేతో బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా ఆడారన్నారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం చేశారన్నారు. అందుకే ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నాకు హాజరు పేరిట మమా అనిపించారన్నారు.