News March 31, 2025
రాచకొండలో రంజాన్ భద్రతా ఏర్పాట్లు

రంజాన్ పండుగ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మసీదుల వద్ద వాహనాల నంబర్ ప్లేట్లు, పత్రాల చెకింగ్ నిర్వహించాలని, అవసరమైన ప్రదేశాల్లో బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపట్టాలని అధికారులకు సీపీ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దర్గా వంటి పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యాంటీ సబోటేజ్ చెక్ టీమ్, డాగ్ స్కాడ్ తనిఖీలు చేపట్టారు.
Similar News
News October 24, 2025
బ్రెస్ట్ క్యాన్సర్ను నివారించే ఆహారాలివే..

ప్రస్తుతకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలిని పాటించడం వల్ల క్యాన్సర్ తీవ్రతను తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే దానిమ్మ, సోయా ఉత్పత్తులు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉసిరికాయ, పియర్, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్లో ఉండే పాలీఫెనాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
News October 24, 2025
బస్సు ప్రమాదంలో.. పటాన్చెరు వాసులు మృతి

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News October 24, 2025
బస్సు ప్రమాదంలో.. పటాన్చెరు వాసులు మృతి

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


