News March 31, 2025
ములుగు: బస్టాండ్ లేక ఇక్కట్లు.. అందుకే ప్రమాదాలు!

మల్లంపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు-హనుమకొండ జాతీయ రహదారిపై ఉన్న ఈ మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ప్రజలు బస్సుల కోసం జాతీయ రహదారిపైనే నిలబడుతున్నారు. దీంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News April 6, 2025
8న అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్?

పుష్ప-2 తర్వాత రెస్ట్ మోడ్లో ఉన్న అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఎల్లుండి కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. నిర్మాత బన్నీ వాస్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తోంది. ‘APR 8న షాకింగ్ సర్ప్రైజ్కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొనడంతో ఐకాన్ స్టార్- అట్లీ మూవీ గురించేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ రోజు టెక్నీషియన్లను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
News April 6, 2025
జగన్ను మించి అప్పులు చేస్తున్న కూటమి: రామకృష్ణ

AP అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారని ఆరోపించిన కూటమి నేతలు ఇప్పుడు ఇంకా ఎక్కువ రుణాలు తెస్తున్నారని మండిపడ్డారు. అమరావతి కోసమే ₹62వేల కోట్లు తెచ్చారని, ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 2 రోజులకే ₹5వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చి BJP, TDP, JSP, YCP ముస్లింలను మోసం చేశాయని ఫైరయ్యారు.
News April 6, 2025
కాళేశ్వరంలో 20 అడుగుల విగ్రహంతో వైభవం

కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలకు దేవాదాయశాఖ, ఇతర విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రూ.25కోట్లు మంజూరు చేసింది. అలాగే ప్రధాన పుష్కర ఘాట్ వద్ద 20 అడుగుల ఎత్తులో సరస్వతి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. మహాబలిపురంలో ప్రత్యేకంగా తయారుచేయించి తెప్పిస్తున్నారు. మే 15న సూర్యోదయం నుంచి పుష్కరాలు ప్రారంభించేందుకు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి ముహుర్తం నిర్ణయించారు.