News March 31, 2025
మడకశిరలో పర్యటించిన సత్యసాయి జిల్లా ఎస్పీ

మడకశిర పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోగా, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం జిల్లా ఎస్పీ ఆత్మహత్య చేసుకున్న గృహాన్ని పరిశీలించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News April 3, 2025
మూడు నెలల్లో రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

మారుమూల గిరిజన గ్రామాలకు ప్రధానమంత్రి జన్ మన్ పథకంలో మంజూరు చేసిన రహదారుల నిర్మాణాలు మూడు నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్, పీఐయూ, గిరిజన సంక్షేమ శాఖలకు రోడ్డు నిర్మాణాలకు పంపిన ప్రతిపాదనలు పరిశీలించి రోడ్డు నిర్మాణాలు చేపట్టాలన్నారు.
News April 3, 2025
గద్వాల: కొత్త పోలీస్ స్టేషన్లు వస్తున్నాయ్..!

గద్వాల నియోజకవర్గ పరిధిలోని కేటీదొడ్డి, ధరూర్ మండలాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం స్థలాలను ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. గద్వాల జిల్లా ఏర్పడిన నుంచి కేటీదొడ్డి మండలంలో అద్దె భవనంలో PS ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కేటీదొడ్డి, ధరూర్ మండలాలకు పోలీస్ స్టేషన్ల కోసం ప్రభుత్వ స్థలాలను ఎస్పీ పరిశీలించారు. డీఎస్పీ, సీఐ తదితరులు ఉన్నారు.
News April 3, 2025
బెల్లంపల్లి: చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి జైలు శిక్ష

చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి సంవత్సరం జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ బెల్లంపల్లి కోర్టు న్యాయమూర్తి J.ముఖేష్ తీర్పునిచ్చారు. పట్టణంలోని బెల్లంపల్లిబస్తికి చెందిన MD.అమ్రాన్ అనే నిందితుడి పై S.సతీష్ రూ.10లక్షలు, K.రమేశ్ రూ.4లక్షలు చెక్ బౌన్స్ కేస్ నమోదైంది. కేసు విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో అమ్రాన్కు జరిమానాతో పాటు సంవత్సరం జైలు శిక్ష విధించారు.