News March 31, 2025
OU దూర విద్యలో ప్రవేశాలకు రేపు లాస్ట్ డేట్

ఓయూ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(పీజీఆర్ఆర్సీడీఈ)లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్-2 కింద UG, PG, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది. అర్హులైన వారు మార్చి 31లోగా అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News September 18, 2025
HYDలో స్పీడ్ ఇంతే.. పెద్దగా ఏం మారలే..!

మహానగరంలో రోడ్లపై వాహనాల వేగం రోజురోజుకూ తగ్గిపోతోంది. కారణం ట్రాఫిక్ జామ్. రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్య నగర రోడ్ల విస్తీర్ణం సరిపోవడం లేదు. ప్రస్తుతం సిటీలో సొంత వాహనాలే 90 లక్షలకు చేరుకున్నాయి. ఇక బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు అదనం. 2024లో సిటీలో సగటు స్పీడ్ 18KMPH ఉంటే ప్రస్తుతం 24 KMPHకు పెరిగింది. ఇక అర్థం చేసుకోండి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో.
News September 18, 2025
ఉస్మానియా ఆస్పత్రికి పూర్వ వైభవం ఎప్పుడో?

కేసీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియ ఆస్పత్రిని 2015లో పరిశీలించి దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఆస్పత్రికి త్వరలో నూతన భవన నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉస్మానియాకు పూర్వ వైభవం తెస్తామని ప్రకటించారు. అప్పటినుంచీ ఇప్పటి వరకు నాయకులు ప్రకటించడమే గానీ వైభవం తెచ్చేలా ఎవరూ పనిచేయడం లేదు. ఇలా ఉంది మన పాలకుల తీరని ప్రజలు చర్చించుకుంటున్నారు.
News September 18, 2025
HYD: ఒకే రోజు.. ఒక్కో తీరు.. ఇదే విచిత్రం!

సెప్టెంబరు 17.. HYD చరిత్రలో ప్రత్యేకమైన రోజు.. నిజాం పాలనుంచి విముక్తి పొంది స్వేచ్ఛను పొందిన ప్రత్యేక సందర్భం. అయితే ఈ వేడుకను ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో చేసుకుంది. అధికార పార్టీ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవం, బీజేపీ హైదరాబాద్ లిబరేషన్ డే పేరిట వేడుకలు జరిపాయి. వీరంతా కలిసి చేసింది ప్రజల విజయాన్నే!