News March 31, 2025

MBNR: సర్వం సిద్ధం.. నేడే రంజాన్ పండుగ

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో నేడు ముస్లింలు రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) నిర్వహించుకోనున్నారు. ఇప్పటికే ఈద్గాలు, మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పలు ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 30 రోజులుగా దీక్షలు చేస్తున్న ముస్లింలు నెల వంక కనిపించటంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ చాంద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Similar News

News April 3, 2025

ముస్లింలను అణచివేసేందుకే వక్ఫ్ బిల్లు: రాహుల్

image

దేశంలోని ముస్లింలను అణచివేసి, వారి ఆస్తి హక్కులను హరించేందుకు వక్ఫ్ బిల్లును ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ముస్లింలను లక్ష్యంగా చేసుకునే వక్ఫ్ బిల్లు తీసుకొచ్చారు. భవిష్యత్‌లో దీనిని ఇతర వర్గాలపై కూడా ప్రయోగించవచ్చు. ఈ బిల్లు ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తుంది. ఇది దేశ ఆలోచనలపై దాడి చేస్తుంది’ అని ఆయన ఎక్స్‌లో తీవ్ర విమర్శలు చేశారు.

News April 3, 2025

కొండాపూర్ ఆర్ఐ సస్పెండ్.. తహశీల్దార్ బదిలీ

image

వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరులో అవకతవలకు పాల్పడిన కొండాపూర్ ఆర్ఐ మహదేవుని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బుధవారం ఉత్తరుడు జారీ చేశారు. తహశీల్దార్ అనితను నారాయణఖేడ్ ఆర్టీవో కార్యాలయం బదిలీ చేశారు. ఆర్ఐ తప్పుడు నివేదిక ఆధారంగా వారసత్వ బదిలీ సర్టిఫికెట్ ఇచ్చారని కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేయించిన కలెక్టర్ వాస్తవమని తేలడంతో సదరు అధికారులపై చర్యలు తీసుకున్నారు.

News April 3, 2025

MDK: శిలాఫలకంపై పదవీకాలం ముగిసిన MLCల పేర్లు.. తీవ్ర విమర్శలు

image

పదవీకాలం ముగిసినా ఎమ్మెల్సీల పేరుతో అభివృద్ధి శిలాఫలకాలు ప్రారంభించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఎమ్మెల్యే రోహిత్ రావు రూ.14 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి శిలాఫలకంపై అధికారులు నిర్లక్ష్యంగా పదవీకాలం ముగిసిన ఎమ్మెల్సీ రగోతం రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు పెట్టడంపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!