News March 26, 2024
రేపటి నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర

AP: సీఎం జగన్ రేపు ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం 10.56గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ఆరంభిస్తారు. ఇచ్ఛాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల యాత్ర చేపట్టనున్నారు.
Similar News
News April 21, 2025
‘ఖురేషీ’ ముస్లిం ఎన్నికల అధికారి .. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ SY ఖురేషీపై BJPఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఖురేషీ కమిషనర్గా ఉన్నకాలంలో ఝార్ఖండ్ సంతాల్ పరగణాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఓటర్లుగా మార్చారని, ఆయన ముస్లిం ఎన్నికల కమిషనర్ అని’ Xలో ఆరోపించారు. కాగా వక్ఫ్ చట్టం ముస్లిం భూములను లాక్కోవడానికి చేసిన ప్లాన్ అని సుప్రీం కోర్టు దానిని గుర్తిస్తుందని ఖురేషీ చేసిన ట్వీట్కు ఎంపీ రిప్లై ఇచ్చారు.
News April 21, 2025
ఈ వారంలో ‘కింగ్డమ్’ ఫస్ట్ సింగిల్: నాగవంశీ

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్డమ్’ మూవీపై నిర్మాత నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News April 21, 2025
ఏప్రిల్ 21: చరిత్రలో ఈరోజు

✒ 1910: ప్రముఖ US రచయిత మార్క్ ట్వెయిన్ మరణం
✒ 1938: ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ మరణం
✒ 1939: తెలుగు రంగస్థల నటుడు భాను ప్రకాశ్ జననం
✒ 2000: బాలీవుడ్ నటి నిగర్ సుల్తానా మరణం
✒ 2013: గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి మరణం(ఫొటోలో)
✒ 2022: రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకరరావు మరణం
✒ నేడు జాతీయ పౌర సేవల దినోత్సవం