News March 26, 2024
ఆమదాలవలస: విరిగిన ఆటో చక్రం… తప్పిన ప్రమాదం

ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో గోతుల రహదారిలోనే ప్రయాణించాల్సి వస్తుందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. తాజాగా సోమవారం రాత్రి గోతిలో దిగబడిన ఆటో ముందు చక్రం విరిగిపడింది. అయితే ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ తెలిపారు. రహదారిని బాగు చేయాలని కోరారు.
Similar News
News April 1, 2026
శ్రీకాకుళంలో మనోళ్లు బీర్లు తెగ తాగేస్తున్నారు

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా 22వ స్థానంలో నిలిచింది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1207.91 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో మద్యం బాక్సులు 1697849, బీర్ 806243బాక్సులు ఉన్నాయి. 2024-25లో 1213.06కోట్ల 1207.91మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో దీనిపై పెద్దగా మార్పు లేదు . 2024-25తో పోలిస్తే 2025-26లో 55శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడుపోవడం విశేషం.
News April 1, 2026
శ్రీకాకుళం: రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనకు రంగం సిద్ధం

పంచాయతీల పాలకవర్గాల ఐదేళ్ల పాలన ఈనెల రెండుతో ముగియనుంది. గురువారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో 912 గ్రామపంచాయతీలు ఉన్నాయి. రెండు లేదా మూడు పంచాయతీలకు ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించారు. మండలంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్లకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఇటీవల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
News April 1, 2026
శ్రీకాకుళం: అమ్మ..ఎందుకు ఇలా చేశావు

పిల్లలకు ఆపద వస్తే కన్నతల్లి మనస్సు విలవిల్లాడిపోతోంది. ఆ ప్రమాదానికి ఎదురెళ్లి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కుటుంబ తగాదాలకు మనస్సును చిన్నబుచ్చుకుంది. ప్రాణమైన చిన్నారులను రైలు కింద తోసి తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన <<19529246>>నరసన్నపేటలో<<>> మంగళవారం జరిగింది. భర్త మద్యం తాగొచ్చాడని జరిగిన గొడవలో మనస్తాపం చెందింది. క్షణికావేశంలో ఈమె తీసుకున్న నిర్ణయం పిల్లలను ఒంటరి చేసింది.


